Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లు ఆ దేశ హోంమంత్రి కె.షణ్ముగం తెలిపారు.ఇటీవల కాలంలో తీవ్రవాద భావజాలం కల్గిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు.ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. ప్రజలంతా మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు.

New Update
singapore

singapore

సింగపూర్ దేశానికి ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆ దేశ హోమంత్రి కె.షణ్ముగమే దీని గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. ఇందుకోసం ప్రజలంతా  రెడీగా ఉండాలన్నారు. దీంతో ఆ దేశ పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిజంగానే దాడులు జరిగే అవకాశం ఉందా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

Also Read: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

తీవ్రవాద భావజాలం...

సింగపూర్‌లో తీవ్రవాద భావజాలం కల్గిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రజాప్రతినిధులు అంటున్నారు. తీవ్రవాద ప్రణాళికలకు సంబంధించిన ఓ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కావడంతో మంత్రి షణ్మగ ఈ వ్యాఖ్యలు చేశారు.ఫోర్ట్ కేనింగ్ పక్కన ఉన్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పరిధిలోని తెండాయుతపాణి ఆలయంలో హిందూ భక్తులు మురుగన్ దేవుడి గౌరవార్థం తైపూసం 2025 పండుగను జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే అక్కడకు వచ్చిన హోంమంత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read:  Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

చైనీయులు మలేయుల మధ్య జాతి యుద్ధాన్ని ప్రారంభించాలనుకున్నట్లు భద్రతా దళాలు గుర్తించినట్లు సమాచారం. 2019 మార్చి నెలలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చిలోని రెండు మసీదుల్లో 51 మందిని చంపిన ఆస్ట్రేలియన్ తెల్లజాతి ఆధిపత్యవాది బ్రెంటన్ టారెంట్‌ను అతడు ఆరాధించినట్లు తెలుసుకున్నారు.

ఈక్రమంలోనే సింగపూర్‌లోని ఒక మసీదులో ముస్లింలపై దాడి చేయాలనుకున్న ఆ యువకుడు, నవ-నాజీ, తెల్ల ఆధిపత్యవాద, తీవ్రవాద సమూహాలకు సంబంధించిన లోగోల కస్టమ్ ప్రింట్లతో టాటూలు వేయించుకున్నాడు. అలాగే టీషర్టులపై ప్రింటులు కూడా వేయించాడు. వీటని గుర్తంచి స్వాధీనం చేసుకున్న అధికారులు యువకుడితో పాటు ఉగ్ర సంస్థలకు సాయం చేస్తున్న ఓ మహిళ సహా మరో డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయాన్ని వివరిస్తూనే మంత్రి షణ్ముగం.. దేశానికి ఉగ్రదాడులు ముప్పు ఉందన్నారు. అయితే అంతర్గత భద్రతా శాఖ క్రియాశీలకంగా వారిని గుర్తిస్తోందని చెప్పారు. అంతేకాకుండా దేశంలో తీవ్రవాద భావజాలం పెరుగుతున్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని చెప్పుకొచ్చారు. 

Also Read: Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్‌!

Also Read: Tirupati laddu: తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్య ప్రచారం.. రిమాండ్ రిపొర్టులో సంచలనాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు