Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్‌!

ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేసే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలోనే వాట్సాప్‌లోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. క్యూఆర్ కోడ్‌తో రేషన్ పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్‌ వివరించారు.

New Update
Nara Lokesh

Nara Lokesh

పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఏపీ సర్కార్‌ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అమల్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. మన మిత్ర పేరిట 161 పౌర సేవలను మొబైల్ ఫోన్‌లోనే పొందే అవకాశం కల్పించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీ ప్రజలకు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయాలని అనుకుంటుందంట.

Also Read: Delhi: పొట్టి దుస్తులు ధరించండంపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

 ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌తోనే రేషన్ పొందేలా త్వరలోనే ఏపీ వాసులకు డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాగే అన్ని శాఖలను వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేట్ చేయనున్నట్లు తెలిపారు.

Also Read: Virat Kohli: లక్కీ లేడీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు హగ్ ఇచ్చిన కోహ్లీ: వీడియో వైరల్!

వాట్సాప్ గవర్నెన్స్...

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన నారా లోకేష్.. వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలియజేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని ధ్రువపత్రాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే అన్ని సేవలు, సర్టిఫికేట్లు వాట్సప్ ద్వారా అందించాలంటే శాఖ‌ల స‌హ‌కారం చాలా అవ‌స‌ర‌మ‌ని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. 

ఈ క్రమంలోనే రేష‌న్ కార్డుల నుంచి అన్ని సేవలు ఆన్ లైన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు.మరోవైపు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సన్నాహాలు మొదలు పెట్టింది. కొత్తగా పెళ్లైనవారికి రేషన్ కార్డులతో పాటుగా పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు త్వరలోనే అవకాశం కల్పించనున్నారు. అలాగే కొత్త రేషన్‌ కార్డులను సరికొత్త డిజైన్లతో అందించాలనే ఆలోచనలో ఏపీ సర్కార్‌  ఉంది. క్రెడిట్‌ కార్డు మోడల్‌ లో క్యూఆర్‌ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 

ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం.. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో వెల్లడించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ తీసుకునేలా... డిజిటల్ రేషన్ కార్డులు ఏపీ ప్రజలకు ఇవ్వబోతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా డిజిటల్ కార్డులు జారీ ఇవ్వనున్నారు.

Also Read: Tirupati laddu: తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్య ప్రచారం.. రిమాండ్ రిపొర్టులో సంచలనాలు!

Also Read: Incom Tax Bill: ఫిబ్రవరి 12న పార్లమెంటుకు ముందు కొత్త ఆదాయపు పన్ను బిల్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు