/rtv/media/media_files/2025/06/18/pm-modi-and-canada-pm-4331f6f9.jpg)
pm-modi-and-canada-pm
PM Modi : కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీ పలువురు నేతలతో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం కెనడాలోని కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-కెనడాల మధ్య సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. కాగా కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక తర్వాత తొలిసారి ప్రధాని మోదీ ఆయనతో సమావేశమయ్యారు.
ఇది కూడా చదవండి: మీరు ప్రతిరోజూ వాటర్ చెస్ట్నట్ తింటే ఏమవుతుంది? నిజాలివే!
గత ఏడాది అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్తో కెనడా సంబంధాలు మరింత దిగజారాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రతిగా సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించడంతో దౌత్యపరమైన ప్రతిష్టంభన పెరిగింది. ఇప్పుడు తిరిగి సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించాయి.తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్ నియామకంపై కుదిరిన ఏకాభిప్రాయం కుదిరింది.
Also Read : హైదరాబాద్లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!
ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గొప్ప గౌరవం అని కార్నీ అన్నారు. ఇంధన భద్రత, ఏఐ భవిష్యత్తులతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసిపోరాడాలని కెనడా ప్రధాని అన్నారు. నిజానికి భారతదేశానికి జీ7 దేశాలలో సభ్యత్వం లేదు. అయినా సమావేశాలకు కెనడా ఆహ్వనం మేరకు హాజరయ్యింది. 2023లో ఖలిస్తానీ అనుకూల వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్తో కెనడా సంబంధాలు మరింత దిగజారాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ కెనడాకు వెళ్లడం ఇదే తొలిసారి. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని అప్పటి ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చడంతో పాటు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం.. ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు కెనడాలో బలోపేతం అయ్యేందుకు అనుమతించిందని ఆరోపించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ఆర్థికవేత్త కార్నీ, ఏప్రిల్లో జస్టిన్ ట్రూడో స్థానంలో ప్రధానిగా అత్యున్నత పదవి చేపట్టారు.
Aslo Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..
కాగా ఇప్పుడు తాజా భేటీ తర్వాత రెండు దేశాలు తమ రాయబారులను ఒకరి రాజధానులకు మరొకరు తిరిగి పంపించాలని అంగీకరించాయి. G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు భారత్ను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా దశాబ్దం తర్వాత ప్రధాని మోదీ కెనడాలో పర్యటించారు. ఐదు దేశాల పర్యటనలో మూడవ, చివరి దశలో ఆయన కెనడా నుండి క్రొయేషియాకు బయలుదేరుతారు.
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !