2025 Calendar: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

1941లో ఉన్న క్యాలెండర్‌, 2025లో ఉన్న క్యాలెండర్‌ పూర్తిగా ఒకేలా మ్యాచ్‌ అయ్యింది. మొత్తం 12 నెలలు కూడా ఒకే తేదీలు, వారాలకు కరెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యాయి. ఇలాంటి యాదృచ్ఛికం సంభవించడం చాలా అరుదు.

New Update
1941, 2025 same Calendar

1941, 2025 same Calendar

2025 యుద్ధాలు, విమాన ప్రమాదాలు లాంటి ఘటనలు ప్రతీ ఒక్కరికి కూడా ఓ జీవిత సత్యాన్ని నేర్పించాయి. అదేటంటే రేపటికీ గ్యారెంటీ లేదు. ఏ క్షణానైనా మృత్యువు రావొచ్చు. ఇలాంటి సందర్భమే 1941లో కూడా ఉంది. ఎందుకుంటే ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఇంతకీ 2025, 1941కి ఏంటి  సంబంధం అని ఆలోచిస్తున్నారా ?. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. 1941లో ఉన్న క్యాలెండర్‌, 2025లో ఉన్న క్యాలెండర్‌ పూర్తిగా ఒకేలా మ్యాచ్‌ అయ్యింది. మొత్తం 12 నెలలు కూడా ఒకే తేదీలు, వారాలకు కరెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యాయి. ఇలాంటి యాదృచ్ఛికం సంభవించడం చాలా అరుదు.

 

January
January
FEB
February
March
March

 

Also Read :  కుప్పం మహిళకు సీఎం చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఇలా జరగడానికి కారణం

1941, 2025 క్యాలెండర్‌ ఒకేలా ఉండటానికి కారణం మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండరే. భూకక్ష్య ఆధారంగా సమయాన్ని సమకాలీకరించి ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. అయితే ఈ క్యాలెండర్‌లో ప్రతీ నాలుగేళ్లకొకసారి లీపు సంవత్సరం వస్తుంది. అంటే ఆ ఏడాదికి 366 రోజులు ఉంటాయి. ఇలా ప్రతీ నాలుగేళ్లకొకసారి అదనపు రోజు జతకూడుతుంది.  ఇది భూ పరిభ్రమణంలో ఉండే స్వల్ప వ్యత్యాసాన్ని సరిచేస్తుంది. చివరికి ఇలా చాలా ఏళ్లకు క్యాలెంటర్‌లు మ్యాచ్‌ అయ్యే అరుదైన సందర్భానికి దారి తీస్తుంది. 

April
April
May
May
June
June

 

 

 

Also Read :  AIతో క్యాన్సర్ టెస్ట్.. కేవలం రూ.3 వేలకే.. ఎలా పని చేస్తుందంటే?

1941లో ఏం జరిగింది

1941లో ఐరోపా రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయింది. మే 20న జూన్ 1 క్రీట్ యుద్ధం మొదలైంది. జూన్ 22న జర్మనీ.. సోవియట్ యూనియన్‌పై దాడి చేసింది. జూలై-సెప్టెంబర్‌ మధ్య కీవ్ యుద్ధం జరిగింది.  డిసెంబర్ 7న జపాన్ మిలిటరీ అమెరికాలోని పేర్ల్‌ హర్బర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 2400 మంది అమెరికన్లు మృతి చెందారు. మొత్తంగా అప్పటి 1941లో యుద్ధాలు, సామూహిక మరణాలు,  బాంబు దాడులు జరిగాయి. అలాగే ఆకలి చావులు కూడా పెరిగాయి.    

July
July
August
August
september
september

 

 

 

Also Read :  చైనాలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం.. 26 మంది తీవ్రంగా..

2025లో ఏం జరుగుతోంది

2025 కూడా దాదాపు 1941 నాటి పరిస్థితులను తలపిస్తోంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల భారత్‌-పాకిస్థాన్ మధ్య కూడా యుద్ధ వాతావరణం సంభవించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌ పేరుతో భారత్‌ పాక్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం సంచలనం రేపింది.

October
October
November
November
December
December

 

 

 

ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో చూసుకుంటే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు భయాందోళనలో ఉంటున్నారు. గాజాలో చూసుకుంటే పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రాంతం దాదాపు ధ్వంసమైపోయింది. అక్కడి ప్రజలు తిండి కోసం ప్రతిరోజూ తిప్పలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పలు యుద్ధ వాతావరణం నెలకొనడంతో 2025లో ఇంకా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనేదానిపై ఆందోళన నెలకొంది. మరికొందరైతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా ఈ పరిస్థితులు దారి తీయొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 1941లో కొనసాగిన రెండో ప్రపంచ యుద్ధం చివరికి 1945లో అణు యుద్ధంతో ముగిసింది. ప్రస్తుతం 2025లో కూడా అణు యుద్ధాల ప్రస్తావన పదేపదే వస్తోంది. ఇప్పుడు కూడా ఏమైనా అణు యుద్ధాలకు దారి తీసే అవకాశం ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.  

Also Read :  TCS సంచలన నిర్ణయం.. బెంచ్‌పై ఇక 35 రోజులే

 

telugu-news | rtv-news | 2025 Calendar | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు