అక్కడ ముప్పుతిప్పలు పడుతున్న భారత విద్యార్థులు..చుట్టుముట్టిన కష్టాలు.. నానా ఇబ్బందులు..!!
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్రంగా క్షీణించాయి. మరోవైపు, భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత అక్కడి భారత విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాల నుంచి బయటపడలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వివాదంపై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్.. కెనడా ప్రధాని ట్రూడోతో మాట్లాడారు. భారత్తో తలెత్తిన ఈ ప్రస్తుత వివాదం వీలైనంత త్వరగా ముగుస్తుందని తాను భావిస్తున్నానని జస్టిన్ ట్రూడోతో రిషి సునాక్ పేర్కొన్నట్లు బ్రిటన్ వెల్లడించింది.