Social Media Ban: నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు నిషేధం

నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నేపాల్ విధించిన రూల్స్ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు పాటించలేదని ఇలా చేసింది.

New Update
social media ban in nepal

Social Media Ban

Social Media Ban: నేపాల్(Nepal) ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్(Facebook Meta), యూట్యూబ్, ఎక్స్ X (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయా సోషల్ మీడియా సంస్థలు నేపాల్ ప్రభుత్వం విధించిన నిబంధనలకు పాటించకపోవడమే ఈ నిషేధానికి కారణమని అధికారులు తెలిపారు.

Also Read: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!

నేపాల్ ప్రభుత్వం 'సోషల్ నెట్‌వర్క్‌ల వినియోగ నిర్వహణకు సంబంధించిన ఆదేశాలు, 2023' ప్రకారం దేశంలో పనిచేసే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నమోదు చేసుకోవాలని, ప్రతినిధులను నియమించాలని నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఆన్‌లైన్ కంటెంట్‌ను పర్యవేక్షించడం, అవాంఛనీయమైన, ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించడం, సైబర్ నేరాలను అరికట్టడానికి పెట్టారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్), గూగుల్ (యూట్యూబ్) వంటి సంస్థలు ఈ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాయి. దీంతో, నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

Also Read: షాకింగ్ వీడియో.. భర్త మాటలు విని బిల్డింగ్ పైనుంచి దూకేసిన భార్య..!

రూల్స్ పాటించినందునే

నేపాల్ ప్రభుత్వం అనేక సార్లు గడువు పొడిగించినప్పటికీ, పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను నమోదు చేసుకోవడానికి ముందుకు రాలేదు. నేపాల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, టిక్‌టాక్, వైబర్ వంటి కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి నమోదు చేసుకున్నాయి. మిగిలిన వాటి నిర్లక్ష్యం కారణంగానే నిషేధం అనివార్యమైంది.

Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

ఈ నిర్ణయంతో నేపాల్ ప్రజలు, ముఖ్యంగా వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే చిన్న వ్యాపారులు, తమ ఆదాయం కోసం డిజిటల్ కంటెంట్‌పై ఆధారపడిన యువతకు ఇది పెద్ద దెబ్బ. ఈ చర్య వాక్‌స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతంలో టిక్‌టాక్‌పై విధించిన నిషేధం వల్ల కలిగిన నష్టాలను ఉదాహరణగా చూపుతూ, ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవనశైలికి హానికరమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద, ఈ నిషేధం కేవలం నియంత్రణ సమస్య కాకుండా, ప్రజల ప్రాథమిక హక్కులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు