/rtv/media/media_files/2025/06/17/etdCTKvk7yML2AZMWFe6.jpg)
CM Chandra babu naidu responds on Kuppam Woman incident
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధితురాలు శిరీషతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముందుగా ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా అని అడగగా.. పలు సందర్భాల్లో కూడా తమను ఇబ్బంది పెట్టినట్లు ఆమె బాధను చెప్పుకుంది.
Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !
ఇలాంటి ఘటనలు సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. మానవత్వం లేకుండా అలా ప్రవర్తించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే శీరిష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగారు. వాళ్లని బాగా చదివించాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకునేందుకు శిరీష ఇబ్బంది పడుతోంది.
Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?
ఆమె పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు.. అప్పటికప్పుడే రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్లో హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటన తదనంతర పరిణామాలపై తనకు రిపోర్ట్ ఇవ్వాలని.. బాధిత కుంటానికి అందుబాటులో ఉండి అవసరమై సాయం పూర్తిగా అందేలా చేస్తామని సీఎం అధికారులను ఆదేశించారు.
ఎంత దారుణ సిట్యుయేషన్ లో ఉంది రా AP
— వరదరాజ్ మన్నార్ (@VARADHA151) June 17, 2025
80 వేలు అప్పు తీర్చిలేదు అని 5 సంవత్సరాల చిన్న పిల్లాడి ముందు భర్త లేని ఒంటరి మహిళని చెట్టుకి కట్టేసి కొడతారా?
అది కూడా CM సొంత నియోజకవర్గం కుప్పం లో pic.twitter.com/WUXP0NAvwF
Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..