/rtv/media/media_files/2025/05/03/MQV9jk6dChrD24z47xt8.jpg)
India announced a complete suspension of trade relations with Pakistan
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్తో వాణిజ్యపరమైన సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పాక్ నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
అనుమతి తప్పనిసరి..
ఈ మేరకు ‘పాక్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి ఇండియాకు వచ్చే అన్నిరకాల వస్తు దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి దిగుమతి చేయకూడదు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధంపై ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి’ అంటూ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read : తెలంగాణలో 800 ఏళ్ల క్రితం నాటి పురాతన వస్తువులు గుర్తింపు.. ఏంటంటే ?
ఇవే ప్రధాన ఎగుమతి, దిగుమతి..
భారత్ ప్రధానంగా సోయా బీన్, పౌల్ట్రీ ఫీడ్, కూరగాయలు, ఎర్ర మిరపకాయలు, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్, ప్లాస్టిక్ నూలు వంటి వస్తువులను ఎగుమతి చేస్తుంది. ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, జిప్సం, సిమెంట్, గాజు, రాక్ సాల్ట్ వంటివాటిని పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఆర్గానిక్ కెమికల్స్, మినరల్ ఫ్యుయల్స్, ప్లాస్టిక్స్, లోహ సమ్మేళనాలు, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్, మసాలా దినుసులు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్ ఉత్పత్తులపై 200% సుంకం
అయితే 2019 పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ ఉత్పత్తులపై 200% సుంకం విధించడంతో పాటు చాలా దిగుమతులు తగ్గించుకుంది భారత్. 2023-24లో అటారి-వాఘా సరిహద్దులో రూ.3,886.53 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఇండియా నుంచి పాకిస్తాన్ 447.65 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేసుకుంది. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాక్ నుంచి 0.42 మిలియన్ డాలర్ల ఉత్పత్తులు మాత్రమే భారత్ దిగుమతి చేసుకోగా ఇందులో ప్రధానంగా వ్యవసాయ వస్తువులున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1శాతం మాత్రమే.
Also Read : మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు ఉంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
411 సెక్షన్ ప్రకారం..
మరోవైపు సముద్ర రవాణా మార్గాలను సైతం కేంద్రం మూసివేసింది. పాక్ ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా బ్యాన్ చేసింది. భారత ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఉత్తర్వులో పేర్కొంది. 'ప్రజా ప్రయోజనం, భారత షిప్పింగ్ భద్రత దృష్ట్యా.. సరుకు రవాణా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో భారత్కు పంపించే ఎగుమతులపైనే కొన్ని పాకిస్తాన్ పరిశ్రమలు ఆర్థికంగా ఆధారపడుతుండగా ఇప్పుడు నిషేధం విధించడంతో ఆయా రంగాల పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. పాకిస్తాన్లోని చిన్న వ్యాపారులు, తయారీదారులపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు.
ప్రత్యామ్నాయం ఇవే..
ఇక పాకిస్తాన్ నుంచి దిగుమతులు ఆపేసిన భారత్ ప్రత్యామ్నాయంగా మరికొన్ని ప్రాంతాలను ఎంచుకుంటోంది. వాణిజ్య లోటును అధిగమించడానికి దుబాయ్, సింగపూర్, కొలంబోలోని ఓడరేవుల ద్వారా కొన్నింటిని దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం.. అటారి సరిహద్దు మూసివేత తర్వాత UAE, సింగపూర్, కొలంబో వంటి ట్రాన్స్షిప్మెంట్ హబ్ల ద్వారా పాకిస్తాన్తో వాణిజ్యం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్గాల ద్వారా దాదాపు 10 బిలియన్ల విలువైన భారతీయ వస్తువులు పాకిస్తాన్కు చేరుకుంటాయని GTRI అంచనా వేస్తోంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
పాకిస్తాన్ ఖర్జూరాలు ట్రాన్స్షిప్మెంట్ హబ్ల ద్వారా భారత ఓడరేవులకు చేరుకుంటాయి. ముఖ్యంగా భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న UAE ద్వారా దిగుమతులు అవుతాయి. ఇండియా, యూఏఈ మధ్య వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్లకు చేరుకుంది. అయితే భారతదేశం పాకిస్తాన్ వస్తువులపై ఆధారపడదు కాబట్టి ఇండియాలో ఆర్థిక ప్రభావం చాలా తక్కువ. పాకిస్తాన్కు ఇప్పటికీ భారతీయ ఉత్పత్తులు అవసరం కాబట్టి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా దిగుమతి చేసుకోవడం తప్పనిసరి అని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Hyderabad: జూబ్లీహిల్స్లో 16ఏళ్ల బాలుడిని రేప్ చేసిన యువతి.. అది చేయాలని వేధింపులు
మరోవైపు పాక్ విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. 1960లో ఇరు దేశాలు సంతకం చేసిన కీలకమైన జల పంపిణీ ఒప్పందమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇది పాక్ ప్రధాన నీటి సరఫరా వనరును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోట్లాది మంది పౌరులపై ప్రభావం చూపుతుంది.
india | pakistan | international news in telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | business news telugu