/rtv/media/media_files/2025/06/08/hC3ezRSIZ4nVTkrAe3oz.jpg)
Expert's ‘worse than Covid’ warning after fungus smuggled into US from China
అమెరికాలో చైనా వ్యవహారాలపై పనిచేసే ఓ ప్రముఖ అమెరికన్ నిపుణులు కీలక హెచ్చరిక చేశాడు. చైనాతో సంబంధాలు పూర్తిగా వదులుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై వేగంగా చర్యలు తీసుకోకపోతే కరోనా కన్నా దారుణమైన ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విషపూరితమైన ఫంగస్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలపై ఇద్దరు చైనా పౌరులు అరెస్టయిన నేపథ్యంలో తాజాగా ఆ నిపుణుడు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..
Expert's ‘Worse Than Covid’ Warning
ఇక వివరాల్లోకి వెళ్తే.. యుంకింగ్ జియాన్, జున్యోంగ్ లియు అనే ఇద్దరు చైనా పౌరులు ఇటీవల అమెరికాలో అరెస్టయ్యారు. పంటలకు నష్టం కలిగించేలా ప్రమాదకరమైన ఫంగస్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణా, కుట్ర, వీసా మోసం ఆరోపణలపై వీళ్లిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలు చూసుకునే ప్రముఖ నిపుణుడు గోర్డాన్ జి.చాంగ్ మాట్లాడారు. ఫంగస్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేసే కుట్ర లోతైన విషయాన్ని సూచిస్తుందని తెలిపారు. అమెరికాను అంతర్గతంగా అస్థిరపరిచేందుకు చైనా నుంచి ఇదొక రహస్య మిషన్ లాంటిదని హెచ్చరించారు. దీన్ని ఆపేందుకు ఏకైక మార్గం చైనాతో సంబంధాలు తెంచుకోవడమేనని సూచించారు.
Also Read : నేరుగా ఓటీటీలోకే కమల్ హాసన్ ‘ఇండియన్ 3’?
అయితే అరెస్టయిన ఆ చైనీయులు అక్రమ రవాణా చేసిన ఫంగస్ అనేది గోధుమ, బార్లీ, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగిస్తుంది. ఇది పంటలలో ఫ్యూసేరియం హెడ్బ్లైట్ లేదా స్కాబ్ అనే వ్యాధికి కారణమవుతుంది. దీనివల్ల పంట నాణ్యత క్షీణిస్తుంది. తద్వారా పంట దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ ఫంగస్ను వ్యవసాయానికి, ఆహార భద్రతకు పెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. దీని వాడకాన్ని వ్యవసాయం ఉగ్రవాదం అని కూడా పిలుస్తున్నారు. ఈ ఫంగస్ వల్ల ఆహార కొరత, ఆర్థిక సంక్షోభంతో పాటు కాలేయం దెబ్బతినడం, పునరుత్పత్తి సమస్యల వరకు తీవ్రమైన అనారోగ్యాలకు గురిచేస్తుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి
అరెస్టయిన చైనా జాతీయులు గతంలో తమ దేశంలో ఈ ఫంగస్పై పనిచేశారని.. దాన్ని అమెరికాకు తీసుకొచ్చిన తర్వాత చట్టవిరుద్ధమైన పరిశోధనలు కూడా చేశారని గోర్డాన్ జి.చాంగ్ ఆరోపించారు. ఇది కేవలం అక్రమ రవాణా మాత్రమే కాదని.. మావోయిస్టు సిద్ధాంతం ఆధారంగా 'పీపుల్స్ వార్' వ్యూహంలో భాగమని పేర్కొన్నారు. దీనిద్వారా శత్రువులను రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా బలహీనం చేయడం, అస్థిరపరచడమే దీని లక్ష్యమని చెప్పారు. చైనాతో సంబంధాలు తెంచుకోకుంటే కరోనా కన్నా పెద్ద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
usa | china | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | American Scientists | corona