Nuclear Weapons: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ దగ్గర 170 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వాటిని ప్రయోగించాలంటే ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. వీటి రక్షణ, వినియోగం మాత్రం పాక్ ఆర్మీ చూసుకుంటోంది. ఇండియా దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి.

New Update
nuclear weapons

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటన తర్వాత, రెండు దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ అణు బాంబులపై ఎవరి నియంత్రణ ఉందనేది చాలామందికి సందేహం వస్తోంది. ఇది ఒక దేశ గోప్యతకు సంబంధించిన విషయం అయినప్పటికీ, ఈ ఆయుధాల వినియోగంపై ఎవరు నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది? పాకిస్తాన్‌ అణ్వాయుధాలు వాడాలంటే దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి పర్మిషన్ ఇవ్వాలి. న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (NCCS) అనే రహస్య సంస్థ కూడా దానిపై నియంత్రణను కలిగి ఉంది. అణ్వాయుధాలను ఉపయోగించాలనే తుది నిర్ణయం రాష్ట్రపతి, ప్రధానమంత్రి కలిసి తీసుకుంటారు. ఒకవేళ వేరే దేశంతో పాకిస్తాన్‌కు యుద్ధం వస్తే.. అందులో న్యూక్లియర్ వెపన్స్ వాడాలా.. వద్దా అనే నిర్ణయం ప్రధాని, రాష్ట్రపతి కలిసి చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో సైన్యం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అణ్వాయుధాల భద్రత, ప్రయోగానికి సైన్యం బాధ్యత వహిస్తుంది.

Also Read :  భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

Control Of Pakistan Nuclear Weapons

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

పాకిస్తాన్ తన అణు కార్యక్రమాన్ని 1970లలో ప్రారంభించింది. భారతదేశ అణు సామర్థ్యాలకు ఏమాత్రం తగ్గొద్దనేదే పాక్ ప్రధాన లక్ష్యం. భారత్ తన మొదటి అణు పరీక్ష 1974లో నిర్వహించింది. దీని తర్వాత, పాకిస్తాన్ క్యూబా, చైనా నుండి సాంకేతిక సహాయం కోరింది. అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి పాక్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరోసారి అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తరువాత పాకిస్తాన్ తన మొదటి అణు పరీక్షను చాగై-Iలో నిర్వహించడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించింది. అప్పటి నుండి పాకిస్తాన్ అణ్వాయుధాల నిల్వ నిరంతరం పెరుగుతూనే ఉంది. స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం జనవరి 2024 నాటికి భారతదేశంలో అణ్వాయుధాల సంఖ్య పాకిస్తాన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. భారతదేశం నిల్వ చేసిన అణ్వాయుధాల సంఖ్య 172 కాగా, పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో భారతదేశ అణ్వాయుధాల సంఖ్య స్వల్పంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. 

Also Read :  వికారాబాద్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

Also Read :  కొడుకునే పెళ్లి చేసుకున్న స్టార్ నటి.. ఒక బిడ్డను కూడా కన్నారు

(due to pahalgam attack | nuclear-weapons | pakistan | india | attack in Pahalgam | pak-pm-shehbaz-sharif | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు