Iran Port Fire: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

ఇరాన్‌లోని చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మరో 750మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇరాన్‌లోని ఓ ఓడరేవులో జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి భవనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఒక భవనం నేలకూలింది.

New Update
Iran Port Fire 25 dead

Iran Port Fire 25 dead

ఇరాన్‌లో రీసెంట్‌గా భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయం సమీపంలో ఈ భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎంతో మంది మృతి చెందారు. నిన్న జరిగిన ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

Iran Port Fire

అంతేకాకుండా ఈ పేలుడు కారణంగా సుమారు 1,139 మంది తీవ్రంగా గాయపడినట్లు మీడియా చెబుతోంది. దక్షిణ ఇరాన్‌లోని ఓ ఓడరేవులో ఈ ఘటన జరిగింది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వంతెనలు, భవనాల అద్దాలు పూర్తిగా పగాలిపోయాయి. అదే సమయంలో ఒక పెద్ద భవనం కూలిపోయింది. 

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also Read :  జాగ్రత్త బాడీలో వాటర్ శాతం తక్కువుంటే.. ఈ లక్షణాలు కనబడతాయి

దీంతో దాని చుట్టూ దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదం సంభవించిన అనంరతరం ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న స్కూల్స్, కార్యాలయాలను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ఈ పేలుడు జరగడానికి గల కారణాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ క్లారిటీ ఇచ్చారు. 

పోర్టులో నిల్వ ఉంచిన కొన్ని కంటైనర్లు బ్లాస్ట్ అవ్వడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్‌ హసన్జాదే తెలిపారు. కాగా దీనికి సంబంధించిన మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read :  ఢిల్లీ కెప్టెన్‌కు డీకే వార్నింగ్.. జోక్స్ ఆపి ముందు బ్యాటింగ్‌ చేయ్ అంటూ (వీడియో)!

Iran Port Fire | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు