/rtv/media/media_files/2025/06/22/uttar-pradesh-woman-poisons-her-two-children-for-illegal-relationship-2025-06-22-07-26-31.jpg)
Uttar Pradesh woman poisons her two children for illegal relationship
భార్య భర్తల మధ్య సంబంధాలు రోజు రోజుకూ మంటగలుస్తున్నాయి. అక్రమ సంబంధాలు (వేరొకరితో ఎఫైర్) పెట్టుకుని తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. పిల్లలు, పరువు, కుటుంబం, సంతోషకరమైన జీవితం వంటివి మరిచి.. వేరొకరితో ఎఫైర్ పెట్టుకుని చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
తమ ప్రాణాలతో పాటు తమ పిల్లల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. తరచూ ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. క్షణాల సుఖం కోసం కన్న బిడ్డలనే కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Illegal Relationship
ఓ మహిళకు ఇద్దరు పిల్లలు. భర్త దూరంగా ఉండటంతో.. తమ దగ్గరి బంధువు అయిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను హతమార్చింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా భోపా పోలీస్స్టేషను పరిధిలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సంజయ్కుమార్ వర్మ తెలిపారు.
Also Read: హోటల్లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
ఆమె పేరు ముస్కాన్. ఆమెకు ఇద్దరు పిల్లలు. అందులో అర్హాన్ (4), అనాయా (1) ఉన్నారు. భర్త వసీం కూలిపనుల కోసం చండీగఢ్కు వెళ్లి.. సంపాదించి డబ్బులు ఇంటికి పంపించేవాడు. భర్త దూరంగా ఉండటంతో ముస్కాన్ తమ బంధువైన జునైద్తో వివాహేతర సంబంధం పెట్టుకొంది. అనంతరం జునైద్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే పిల్లలను తాను పోషించలేనని ప్రియుడు జునైద్ చెప్పడంతో పక్కా ప్లాన్ వేసింది.
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..
రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను చంపేసింది. విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపెట్టింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం జునైద్ కోసం గాలిస్తున్నారు.
latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu | illegal affairs