Sonam Raghu Vamsi: భర్త హత్యకు 20 లక్షల సుపారీ..తానే స్వయంగా డెడ్ బాడీని తోసేసిన సోనమ్

రాజా రఘవంశీ హత్య కేసులో సంలచన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం ప్లాన్ కు భార్య సోనమ్ కారణమని మేఘాలయా పోలీసులు తేల్చారు. భర్త హత్యకు 20 లక్షల సుపారీ ఇవ్వడమే కాకుండా..డెడ్ బాడీని తానే స్వయంగా లోయలోకి తోసిందని చెప్పారు.

New Update
murder

Raja Raghu vamsi murder case

రాజా రఘువంశీ, సోనమ్ కొత్తగా పెళ్ళయిన జంట. కానీ పెళ్ళయిన కొన్ని రోజులకే హనీమూన్ కు వెళ్ళిన వారు కనిపించకుండా పోయారు. వారం రోజుల తర్వాత రాజా రఘువంశీ శవమై కనిపించాడు. అతని హత్యకు కారణం భార్య సోనమ్ నే అని తేలింది. రాజా హత్యకు  హత్యకు కర్త, కర్మ, క్రియ మొత్తం భార్య సోనమ్ రఘువంశీనే అని మేఘాలయ పోలీసులు తేల్చారు. హత్యోదంతం ఎలా జరిగిందో మొత్తం వివరాలతో సహా బయటపెట్టారు.

Also Read :  ఇండియాలో తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న అవగాహన

మే 11న రాజా రఘువంశీ, సోనమ్ ల పెళ్ళి అయింది. ఆ తరువాత వారిద్దరూ సోనమ్ మూడు రోజులు అత్తారింట్లో ఉంది. ఆ మూడు రోజులూ ఆమె భర్తకు దూరంగానే ఉంది. ఎందుకంటే పెళ్ళయిన వెంటనే రాజాను చంపాలని సోనమ్ స్కెచ్ గీసింది.  ఆ తరువాత పుట్టింటికి వెళ్ళింది. ఆ సమయంలోనే ప్రియుడు రాజ్ కుష్వాహాకు సోనమ్ మెసేజ్ పెట్టింది. భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నానని చెప్పింది. అప్పుడే వారిద్దరూ కలిసి రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ వేశారు. రూ.4 లక్షలకు కిరాయి హంతకులను మాట్లాడుకున్నారు. 

Also Read :  నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్.. BRK భవన్ లో సేమ్ సీన్ రిపీట్!

డెడ్ బాడీని స్వయంగా లోయలోకి తోసి..

ఆ తరువాత మే 20న సోనమ్ భర్తతో కలిసి మేఘాలయా వచ్చింది. వీరిద్దరినీ హంతకులు వెంటాడుతూనే ఉన్నారు. స్థానికంగా ఒక స్కూటీని తీసుకుని రాజా, సోనమ్ జంట విహరిస్తూ ఉండేది. ఎక్కడికెళ్లినా సోనమ్.. ప్రియుడికి లొకేషన్ పంపిస్తూ ఉండేది. అలా జంటను కిరాయి ముఠా వెంటాడుతూ ఉండేది. అయితే ఎక్కడా భర్తకు మాత్రం అనుమానం రాకుండా చూసుకుంది. మే 21న మేఘాలయాకు వచ్చిన వాళ్ళు..మే 23న మేఘాలయలోని జలపాతాన్ని చూసేందుకు నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్ చేశారు. వాళ్ళతో పాటూ ముఠా కూడా వెళ్ళింది. కొంత టైమ్ గడిచాక సోనమ్ అలిసిపోయినట్లు నటించింది. దీంతో రాజా ఒక్కడే పైకి వెళ్ళాడు. అతను ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళిన తర్వాత కిరాయి హంతకులను సోనమ్ ప్రేరేపించింది. అయితే వాళ్ళు తాము కూడా అలిసిపోయామని ఇప్పుడు కాదని చెప్పారు. దాంతో వెంటనే తన భర్తను చంపితే రూ.20 లక్షలు ఇస్తానని సోనమ్ చెప్పింది. దీంతో హంతకులు రాజాను కొట్టి చంపేశారు. అతను చనిపోయాడని కన్ఫార్మ్ చేసుకున్నాక సోనమ్ స్వయంగా హంతకులతో కలిసి భర్తను లోయలోకి తోసేసింది. రాజా పోస్ట్ మార్టం రిపోర్టులో తల వెనుక, ముందు భాగంలో రెండుసార్లు దెబ్బలు తగిలినట్లుగా తేలింది.

Also Read :  డ్రగ్స్ తో దొరికిపోయిన సింగర్ మంగ్లీ.. బర్త్ డే పార్టీలో భారీగా ఫారెన్ మద్యం!

మే 23న రాజా రఘువంశీ, సోనమ్ జంట కనిపించడం లేదంటూ కేస్ ఫైల్ అయింది. పోలీసులు రంగంలోకి దిగి జల్లెడ పట్టగా జూన్ 2న రాజా శవం దొరికింది. ఆ తర్వాత జూన్ 9న సోనమ్ యూపీలోని ఘాజీపూర్ లో లొంగిపోయింది. అనంతరం హత్యలో పాల్గొన్న సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Also Read: LA: ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్ లాస్ ఏంజెలెస్ ..గతంలోనూ గొడవలు..

 

today-latest-news-in-telugu | Meghalaya Honeymoon Murder Case | Sonam | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు