Tirupati : అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. రోకలిబండతో కూతుర్ని బాదిన తల్లి!

తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి జరిగింది.

New Update
affair

తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు(son-in-law) కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది(Mother Attack On Daughter) ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి(love-marriage) జరిగింది. మైనర్ బాలిక తల్లి సైతం అల్లుడుతో కలసి ఒకే ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో అల్లుడితో అత్తకు అక్రమ సంబంధం(Illegal Affair) ఏర్పడింది. శుక్రవారం రాత్రి భార్య పక్కన ఉండగా వారిద్దరూ పెళ్లి చేసుకోబోయారు.  ఈ క్రమంలో  తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను చూసి బాలిక అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె తల్లి, భర్త బాధితురాలిపై దాడి చేశారు. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు వచ్చి రక్షించారు. అత్త, అల్లుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. గాయాలపాలైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Also Read :  గాయకుడు జుబీన్‌ గార్గ్ మృతిలో బిగ్‌ ట్విస్ట్‌.. ఆయనపై విష ప్రయోగం? సంచలన ఆరోపణలు..

కామాంధుడి వేధింపులకు వివాహిత బలి 

ఓ కామాంధుడి వేధింపులకు వివాహిత బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరవోలు ఎస్సీకాలనీకి చెందిన మేడపాటి ప్రవీణ్‌రాజు, వసంత (24) దంపతులకు ఇద్దరు మగ పిల్లలు సంతానం. ప్రవీణ్‌రాజు రాడ్‌ వెల్డింగ్‌ పనులు చేస్తు్ండగా..  వసంత గృహిణి..అయితే కొంతకాలం నుంచి అదే గ్రామానికి చెందిన ప్రైవేటు బస్సు డ్రైవర్‌ మేరుగుమాల పవన్‌ అనే వ్యక్తి వసంతను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇంట్లో విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు గట్టిగానే మందలించారు. అయినప్పటికీ పవన్ నుంచి వేధింపులు ఏ మాత్రం ఆగలేదు.

Also Read : Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగో పరుగు

ఈ క్రమంలో పవన్‌ ఆగడాలు భరించలేక వసంత శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం(suicide) చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వసంత కన్నుమూసింది. కన్నతల్లి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు బోరున విలపిస్తున్నారు. వసంత ఆత్మహత్యకు కారణమైన పవన్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు పామర్రు- దిగమర్రు నేషనల్ హైవేపై కొమరవోలు ముఖద్వారం వద్ద రాస్తారోకో చేశారు. పామర్రు పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా నిరసన విరమించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పామర్రు ఎస్సై రాజేంద్రప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.  అనంతరం వసంత మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Also Read :  ప్రేమ పేరుతో కానిస్టేబుల్‌ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి

Advertisment
తాజా కథనాలు