/rtv/media/media_files/2025/06/20/lover-mahabubabad-2025-06-20-14-32-13.jpg)
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డుచెప్పాడని కన్నతండ్రిని కడతేర్చారు కసాయిబిడ్డలు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కూతుళ్లు. మరిపెడ మండలం జెండాల తండాకు చెందిన ధారావత్ కిషన్, కావ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. సురేష్ అనే వ్యక్తితో కిషన్ చిన్నకూతురు పల్లవి ప్రేమ వ్యవహారం నడుపుతోంది. తరుచూ ఫోన్ మాట్లాడుతుండటంతో పల్లవిని మందలించాడు తండ్రి కిషన్. తన ప్రేమను ఒప్పుకోవట్లేదని ప్రియుడితో కలిసి తండ్రిని చంపేందుకు పల్లవి స్కెచ్ వేసింది.
Also Read : పాకిస్తాన్ భూజాలపై తుపాకి పెట్టి ఇరాన్కి దెబ్బ.. దిమ్మతిరిగిపోయే ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!
Also Read : ఎమ్మెల్యే Vs మేయర్.. కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
పక్కటెముకలు విరగొట్టి
పల్లవికి కిషన్ భార్య కావ్య, పెద్దకూతురు రమ్య కూడా సహకరించారు. పక్కటెముకలు విరగొట్టి, పిడుగుద్దులతో కిషన్ పైకి దాడి దిగారు కూతుళ్లు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిషన్ మృతి చెందాడు. కిషన్ బంధువుల ఫిర్యాదుతో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో కిషన్ భార్య కావ్య, కూతుళ్లు రమ్య, పల్లవి ఉన్నారు. చిన్న కూతురు ప్రియుడు సురేష్, అతని బంధువులు పరారీలో ఉండగా పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బ్యాటింగ్!
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
mahabubabad | latest-telugu-news | telugu-news | latest telangana news | today-news-in-telugu | telugu crime news | father killed daughter