/rtv/media/media_files/2025/06/20/kadapa-mla-vs-mayor-2025-06-20-15-13-01.jpg)
kadapa mla vs mayor
కడప మున్సిపాల్ కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా మేయర్, ఎమ్మెల్యే మధ్య మరోసారి వివాదం రాజుకుంది. నగరప పాలక సర్వసభ్య సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేసిన అధికారులు సమావేశ మందిరంలో అందుకు తగినట్లు కుర్చీలు వేశారు. మేయర్, కమిషనర్తోపాటు కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు అవసరమైన కుర్చీలు ఏర్పాటు చేశారు. సమయానికి సమావేశానికి వచ్చిన కడప ఎమ్మెల్యే మాధివి రెడ్డి తనకు కేటాయించిన సీటులో కూర్చుకున్నారు. అయితే దీనిపై మేయర్ సురేశ్బాబు అగ్రహం వ్యక్తం చేస్తూ తనను అడగకుండా కుర్చీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. మరోవైపు సమావేశానికి హాజరైన కడప ఎమ్మెల్యే చాలాసేపు వేచి చూసినప్పటికీ సమావేశం ప్రారంభించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. అమెరికాపై ఇరాన్ సంచలన ప్రకటన!
Kadapa Corporation Meeting
అధికారులు సమావేశ మందిరంలో మీటింగ్కు ఏర్పాట్లు చేసినప్పటికీ మేయర్ అక్కడ కూర్చో్కుండా తన ఛాంబర్ లోనే సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు కూడా మేయర్ ఛాంబర్లోనే సమావేశమయ్యారు. కాగ సమావేశ మందిరంలో కడప ఎమ్మె్ల్యే మాధవిరెడ్డి ఉండటాన్ని గమనించిన మేయర్ సురేశ్బాబు అధికారులపై ఒంటికాలిపై లేశారు. తనకు తెలియకుండా సమావేశ మందిరంలో సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారంటూ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించాలని తాను ముందుగానే కమిషనర్కు లేటర్ రాసినట్లు మేయర్ తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు వేదికను సమావేశ మందిరానికి మార్చినట్లు వివరించారు. అయితే అదేం వినకుండా అది నిర్ణయించాల్సింది నేనా? మీరా? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
కాగా సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పోరేటర్లు చాలాసేపు సమావేశమందిరంలోనే వేచిచూశారు. అయినప్పటికీ వైసీపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ నుండి సమావేశ మందిరానికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఛాంబర్లో ఎలా నిర్వహిస్తారంటూ మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ మందిరంలో కాకుండా మేయర్ ఛాంబర్లో సమావేశమవ్వడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్రెడ్డి కూడా సమావేశ మందిరానికి వచ్చి చాలా సేపు వేచి చూసినప్పటికీ మేయర్ కానీ వైసీపీ కార్పొరేటర్లు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
కమిషనర్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది కూడా సమావేశ మందిరంలోనే సమావేశమయ్యారు. కానీ, మేయర్ తన ఛాంబర్లో సమావేశం ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదివరకు జరిగిన సమావేశాల్లో కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకుండా అవమానపరచడం పై వివాదానికి దారితీసింది. అలా రెండుసార్లు ఇదే విషయమై వాయిదా పడిన సమావేశాలు మూడవసారి కూడా అదే విషయంలో వివాదం రాజుకోవడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది.
Also Read : ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్
kadapa | kadapa madhavi reddy | kadapa mayor | Madhavi Reddy Fires on Kadapa Mayor | telugu-news | ap telugu news | Breaking Telugu News