Regina Cassandra: వాళ్లకు వేరే ఆప్షన్ లేదు.. సౌత్ నటులపై రెజీనా షాకింగ్ కామెంట్స్!

నటి రెజీనా హిందీ చిత్రపరిశ్రమకు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే హిందీలో అవకాశాలు ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు హిందీ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సౌత్ తారలను ఎంచుకోవడం వారికి అవసరంగా మారిందని అన్నారు.

New Update
Regina Cassandra comments

Regina Cassandra comments

Regina Cassandra:  టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా ప్రస్తుతం  'విదాముయార్చి' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో అజిత్ హీరోగా, త్రిష కథానాయికగా కీలక పాత్రలు పోషించారు. అయితే ఇందులో మరో కీలక పాత్ర పోషించిన అర్జున్ జోడీగా రెజీనా కనిపించనుంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజినీ హిందీ పరిశ్రమను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 

Also Read: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

బాలీవుడ్ పై రెజినీ కామెంట్స్ 

"గతంలో సౌత్ నటీనటులకు బాలీవుడ్ లో అవకాశాలు దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. అప్పట్లో సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే అసలు ఛాన్సులు ఇచ్చేవారు కాదు. అలా చేయడానికి భాషపరమైన ఇబ్బందులు కూడా ఒక కారణమై ఉండవచ్చు. కానీ, కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు సౌత్ తారలకు వాళ్లే అవకాశాలు ఇస్తున్నారు. తమ చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సౌత్ తారలను ఎంచుకోవడం అవసరంగా మారింది అని చెప్పారు రెజీనా. అలాగే తాను బాలీవుడ్ ప్రాజెక్టులు చేయడం గురించి మాట్లాడుతూ.. తాను  ఇలాంటి ఇబ్బందులేవి ఎదుర్కోలేదని తెలిపింది. ప్రస్తుతం తాను ఒక బాలీవుడ్ మూవీ సైన్ చేశానని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను పంచుకుంటానని చెప్పింది. "

Also Read :   జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

Also Read: Monalisa: ఆ సినిమాలో మోనాలిస్.. ఇంటికెళ్లి డైరెక్టర్ అగ్రిమెంట్.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు