/rtv/media/media_files/2025/01/29/mUPnk04GL7bHoWxQFVmR.jpg)
nbk family
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబంలో పద్మ అవార్డు అందుకున్న రెండో వ్యక్తి బాలయ్యు. అంతకుముందు 1968లో బాలకృష్ణ తండ్రి, దివంగత నటుడు ఎన్టీఆర్ కు పద్మశ్రీ అవార్డు వరించింది. ఎన్టీఆర్ తో పాటుగా అక్కినేని నాగేశ్వరరావు కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చి అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
దాదాపుగా 56 ఏళ్ల తరువాత నందమూరి కుటుంబంలో బాలయ్యను పద్మభూషణ్ అవార్డు వరించింది. దీంతో సినీ ఇండస్ట్రీతో పాటుగా నందమూరి అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ తనయులైన కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు సోషల్ మీడియా వేదికగా బాల బాబాయ్ కు కంగ్రాట్స్ అంటూ సంతోషంతో పోస్టులు పెట్టారు.
ఘోర అవమానం
అయితే తాజాగా కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం జరిగింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ఇందులో ప్రతి ఒక్క నందమూరి సోదరులు, సోదరీమణుల కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించారు. కానీ ఎన్టీఆర్, ఆమె తల్లి శాలినీ పేర్లను ఎక్కాడా కూడా ప్రచురించలేదు. కల్యాణ్ రామ్ పేరును కూడా ప్రస్తావించలేదు కానీ ఆయన తల్లిదండ్రులైన కీర్తి శేషులు హరికృష్ణ, శ్రీమతి లక్మి పేర్లనున్నాయి.
నందమూరి, నారా కుటుంబం బాలకృష్ణ పద్మభూషన్ వచ్చినా సందర్భంలో ఇచ్చిన పేపర్ యాడ్లో కనిపించని జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు. @tarak9999 . Yellow batch ki intha paga jr ntr paina.@tarak9999 pic.twitter.com/gAlZrH7xpx
— saikiran goud (@psaikiran007) January 29, 2025
కానీ హరికృష్ణ రెండో భార్య శాలినీ, కొడుకు ఎన్టీఆర్ పేర్లను మాత్రం ప్రస్తావించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హరికృష్ణ రెండో భార్యగా శాలినీని నందమూరి కుటుంబ సభ్యులు గుర్తించడం లేదనే వాదనలకు మరింత బలం చేకూరింది. ఎన్టీఆర్ రెండో భార్యగా లక్ష్మీపార్వతిని కుటుంబ సభ్యులు పట్టించుకోనట్టే.. శాలినీని కూడా నందమూరి కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ దిగొచ్చినా.. తగ్గేదే లేదంటున్న బాలయ్య?
— Pulse News (@PulseNewsTelugu) January 29, 2025
బాలయ్య, నందమూరి బ్రదర్స్ మధ్య విభేదాలున్నాయని ఇండస్ట్రీలో ప్రచారం
కొంతకాలం నుంచి ఎక్కడా కలిసి కనిపించని బాబాయ్, అబ్బాయ్లు
ఇలాంటి టైంలో.. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చాక విషెస్ తెలుపుతూ తారక్ ట్వీట్
అయినా దిగిరాని బాలయ్య.. ఇందుకు… pic.twitter.com/ZmaUXBvm6v
బాలయ్యకు పద్మభూషణ్ వచ్చాక విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయినప్పటికీ బాలయ్య దిగిరాలేదని.. ఆయన మనసు కరగలేదు అనడానికి ఈ పేపర్ యాడ్స్ ప్రత్యక్ష సాక్ష్యం అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
Also Read : Japan Invitation : జపాన్కు రండి... ట్రంప్కు ఆహ్వానం.. ఎందుకంటే!