/rtv/media/media_files/2025/06/09/QfcrqicQmwoZXQXYENjO.jpg)
Kollywood hero vikram reject ssmb29 movie
మహేశ్ బాబు - రాజమౌళి ‘SSMB29’ సినిమా షూటింగ్ పరుగులు పెడుతుంది. ఇటీవల ఈ చిత్రాన్ని పట్టాలెక్కించిన జక్కన్న ఓవర్స్పీడ్తో దూసుకుపోతున్నాడు. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'SSMB 29' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక అప్డేట్ వైరల్ అవుతూనే ఉంది.
Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ పాన్ వరల్డ్ మూవీలో పాత్ర కోసం మేకర్స్ ఓ స్టార్ హీరోను అప్రోచ్ అయ్యారని.. కానీ అతడు దానికి నో చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్ తక్కువకే!
విలన్గా స్టార్ హీరో
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్ను ఓ పాత్ర కోసం మేకర్స్ ఎంపిక చేశారని.. కానీ అది విలన్ పాత్ర కావడంతో అతడు నో చెప్పారని సమాచారం. దీనిపై చర్చలు కూడా జరిగాయని.. కానీ విక్రమ్ విలన్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో రిజక్ట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. దీంతో అతడి స్థానంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్
ఇదిలా ఉంటే.. సినిమాకు సంబంధించిన మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. లీక్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే ఒడిశా షెడ్యూల్ నుంచి లీకైన మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో జక్కన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. సెట్స్లో మొబైల్ ఫోన్ల వాడకంపై కఠినమైన నియమాలను అమలు చేశారు. ప్రధాన నటులు మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు.
Also Read: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్