AP Earthquake: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. ముండ్లమూరు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 12.47 గంటలకు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

New Update
earthquake

Earthquake

ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్వ భూకంపం సంభవించింది. ముండ్లమూరు మండల పరిసరాల్లో మరోసారి భూమి కంపించింది. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

4 సెకండ్లపాటు

దీంతో ఒక్కసారిగా తమ ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగెత్తుతూ రోడ్లపైకి వచ్చారు. ఈ ప్రకంపనలు సుమారు 4 సెకండ్లపాటు కొనసాగినట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రకాశం జిల్లాలో భూమి కంపించడం ఇదేమి మొదటి సారి కాదు. ఇది వరకు చాలా సార్లు ఆ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 

Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

కొలంబియాలో సైతం భారీ భూకంపం

ఇదిలా కొలంబియాలో సైతం భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. కాగా ఈ భారీ భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని.. శనివారం తెల్లవారుజామున కొలంబియా రాజధాని బొగోటాను కూడా తాకిందని GPZ వెల్లడించింది. 

Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

ఈ భారీ భూకంపం కారణంగా భవనాలు నేలకూలాయి. ప్రజలు తమ ఇళ్లల్లోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురై తమ ఇళ్లను వదిలి పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా రోడ్లలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆ నగరం అంతటా సైరన్లు మోగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. 

Also Read: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్

Advertisment
Advertisment
తాజా కథనాలు