/rtv/media/media_files/2025/06/10/4ZYz9FK6pfJwltvBhZAF.jpg)
katrina kaif maldives tourism ambassador
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మాల్దీవ్స్ గ్లోబల్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మాల్దీవ్స్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై కత్రినా ఆనందం వ్యక్తం చేశారు. మాల్దీవులు అందానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. సహజ సౌందర్యంతో.. మాల్దీవులు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పర్యాటకులను పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
Also Read : 'కన్నప్ప' ట్రైలర్ డేట్ ఫిక్స్.. విష్ణు స్పెషల్ పోస్టర్
అందుకే కత్రినా?
అయితే గతేడాది భారతదేశంతో మాల్దీవులకు దౌత్యపరమైన సమస్యలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవులకు వెళ్ళే భారత్ పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి భారత పర్యటకులను ఆకర్షించేందుకు కత్రినాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు తెలుస్తుంది. నియామకాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. కత్రినాకు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆమె ప్రజాదరణ, అందం మాల్దీవుల అందమైన దృశ్యాలకు అద్భుతమైన జోడింపు అవుతుందని Visit Maldives భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు కాదు ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటనకు ఒక నెల ముందు కత్రినా కైఫ్ నియామకం జరగడం గమనార్హం.
Also Read : అలెర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
Also Read : భారీ కాల్పులు.. 11 మంది విద్యార్థులు మృతి
కత్రినా కైఫ్ నియామకంతో పాటు, Visit Maldives 'సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్' పేరుతో ఒక ప్రత్యేకమైన సమ్మర్ సేల్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా మాల్దీవుల సహజ సౌందర్యం, అద్భుతమైన సముద్ర తీరాలను ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కత్రినా కైఫ్ ఈ ప్రచారానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.
Also Read : ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం - వీడియో
katrina-kaif | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | Bollywood Actress