ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్ సిటీలోని లెండ్ ప్రాంతాలోని ఓ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులకు తెగబడ్డ ఆగంతకుడు కూడా తనను తాను కాల్చుకొని మృతి చెందాడు.
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
ఈ షూటింగ్ ఘటనకు పోలీసులు ధీటుగా స్పందించారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేశారు. మృతి చెందిన బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల్లో విద్యార్థులతో పాటు టీచర్లు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే కాల్పులు జరిపిన ఆగంతకుడు ఎవరు, ఈ ఘటన వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియలేదు. అధికారులు దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
Also Read: కామంతో రెచ్చిపోయిన 60 ఏళ్ల ముసలోడు.. బతికుండగానే తగలబెట్టేసిన మహిళలు