Stock Market Losses Today: వరుసగా రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ ఫలితాల నడుమ వారం క్లోజింగ్ డే మార్కెట్లు డౌన్ తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా..నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది.

New Update
Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ 

Stock Market Losses Today: భారతీ ఎయిర్‌టెల్‌(Bharti Airtel), ఇన్ఫోసిస్‌(Infosys), ఎస్‌బీఐ(SBI) వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు జోరుగా ఉన్నాయి. దీంతో సూచీలు ప్రారంభ సమయం నుంచే నేల చూపులు చూస్తున్నాయి. సెన్సెక్స్(Sensex) 200 పాయింట్లకు పైగా క్షీణతతో 82,300 స్థాయిలో ఉండగా.. నిఫ్టీ(Nifty) కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,000 స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.

Also Read: India -Afghanistan: పాక్ కు బిగ్ షాక్.. తాలిబన్లతో భారత్ చర్చలు!

సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 18 స్టాక్‌లు క్షీణించగా, 12 స్టాక్‌లు పెరుగుదలను చూపిస్తున్నాయి.  నేడు బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు బాగా క్షీణిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.  మరోవైపు, ఇంధనం, ఫైనాన్స్ స్టాక్‌లు అధికంగా ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.42 వద్ద ప్రారంభమైంది. 

అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు..

ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 96 పాయింట్లు (0.25%) తగ్గి 37,659 వద్ద ట్రేడవుతోంది. కొరియాకు చెందిన కోస్పి 5 పాయింట్లు పెరిగి 2,621 వద్ద ట్రేడవుతోంది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ సూచీ 164 పాయింట్లు (0.70%) తగ్గి 23,288 వద్ద ముగిసింది. చైనా షాంఘై కాంపోజిట్ 17.50 పాయింట్లు (0.52%) తగ్గి 3,363 వద్ద ముగిసింది.
మే 15న, అమెరికా డౌ జోన్స్ 271 పాయింట్లు (0.65%) పెరిగి 42,322 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 34 పాయింట్లు తగ్గి 19.11కి చేరుకుంది.

Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!

తగ్గిన రెపో రేటు..

ఇక వచ్చే నెల జూన్ నుండి దీపావళి వరకు ఆర్‌బిఐ రెపో రేటును 0.50% తగ్గించనుంది. దీనికి సంబంధించి ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ తదుపరి సమావేశం జూన్ 4-6 వరకు జరగనుంది. ఈ మీటింగ్ కు ముందే రెపో రేటును 0.25% తగ్గించడంపై ఒక ఒప్పందం కుదిరింది. దీని తరువాత, ఆగస్టు 5-7 లేదా సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు జరిగే సమావేశంలో కూడా ఇలాంటి కోతలు జరగవచ్చని చెబుతున్నారు. రెపో రేటు తగ్గింపు కారణంగా, దానికి సంబంధించిన గృహ మరియు కారు రుణాలు చౌకగా మారతాయి. అలాగే పరిశ్రమలకు కూడా చౌక రుణాలు అందుతాయి. 

 today-latest-news-in-telugu | stock-markets | sensex-today | nifty 

Also Read: Ind-Usa: జీరో టారీఫ్ పై ఏ నిర్ణయమూ తీసుకోలేదు..జై శంకర్

Advertisment
Advertisment
తాజా కథనాలు