Nitin Gadkari: టూవీలర్లకు టోల్‌ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.

New Update
Union Minister Nitin Gadkari

Union Minister Nitin Gadkari

టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే మోటారు సైకిళ్లపై జులై 15 నుంచే టోల్ అమల్లోకి తీసుకురానున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.

Also Read :  యోధురాలిగా రష్మిక మరో కొత్త ప్రాజెక్ట్! పోస్టర్ వైరల్

Nitin Gadkari Responds To Two Wheeler Toll Fee

టూవీలర్లకు టోల్‌ వసూలు చేసే ఉద్దేశం లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని మండిపడ్డారు. టోల్ పన్నుపై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని, వాస్తవాలు తెలీకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదన్నారు. టోల్‌ ఫీజు ప్రతిపాదనేదీ లేదని NHAI ప్రకటన విడుదల చేసింది. 

Also Read :  ఎయిరిండియా విమాన ప్రమాదం.. బ్లాక్‌బాక్స్‌ నుంచి డేటా రికవరి

Also Read :  ఇంటి నుంచి తల్లి గెంటివేత...కుమారులకు షాక్‌ ఇచ్చిన రెవెన్యూ అధికారులు

FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. బైక్‌లతో  పాటు ఆటోలకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయని ప్రచారం జరిగింది. 

Also Read :  ఏడు రోజులు వరుసగా పచ్చి ఏలకులు తింటే ఏమవుతోందో తెలుసా?

 

nitin-gadkari | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | business news telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు