Train Accident:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటలకు ట్రాక్ మీద ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.