పంది కొవ్వు కేజీ రూ.1,400. రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారు?
తిరుమల లడ్డూ ఇష్యూపై న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. కేజీ రూ.1,400 ఉన్న పంది కొవ్వు రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఇంతకన్నా అవివేక ఆరోపణలు ఉండవని చంద్రబాబుపై మండిపడ్డారు.