AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి రూ.5,837 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు సమాచారం.