AP Crime : భార్యపై అనుమానం.. పిల్లలను చంపి.. సూసైడ్ చేసుకుంటానని...

భార్యమీద అనుమానంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపిన ఘటన ఏపీలోని  కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. పిల్లలను చంపిన తర్వాత తను అత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడి పోలీసులకు చిక్కాడు నిందితుడు. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానమే హత్యలకు కారణమని తేలింది.

New Update
(Mailavaram

Suspecting his wife...killing the children

AP Crime: భార్యమీద అనుమానంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపిన ఘటన ఏపీలోని  కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. పిల్లలను చంపిన తర్వాత తను అత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకమాడి పోలీసులకు చిక్కాడు నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రవిశంకర్, చంద్రిక భార్యభర్తలు. చంద్రిక కొన్ని నెలల క్రితం విదేశాలకు వెళ్లింది. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలు హిరణ్య (9), లీలసాయి (7)ను భర్త వద్దే ఉంచి వెళ్లింది. అయితే విదేశాలకు వెళ్లిన భార్యమీద రవిశంకర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇంట్లోనే ఈ నెల 8న  ఇద్దరు పిల్లలను చంపేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి పారిపోయాడు. 

Also Read: Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని..  తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల

Father Killed Childrens

అయితే ఇంట్లో విగతజీవులుగా పడిఉన్న పిల్లలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  అయితే భార్య దూరమైందన్న మనస్థాపంతో పిల్లల్ని చంపి తను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని, తను చనిపోతే పిల్లలను ఎవరు పోషిస్తారనే అనుమానంతో చంపి ఉంటాడని అందరూ అనుకున్నారు.  ఇంట్లో ఓ సూసైడ్‌ లెటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.“నా చావుకు ఎవరు బాధ్యులు కాదని, జీవితంలో ఏమి సాధించలేదని.. అందుకే నా పిల్లలను చంపి నేను చనిపోతున్నానని” లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు రవి శంకర్‌. కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డ్రామా ఆడినప్పటికీ అతని డెడ్‌బాడీ దొరకకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో  కాల్ డేటా ఆధారంగా రవిశంకర్‌ను సింహాచలంలో అరెస్ట్ చేశారు. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

 కాగా రవిశంకర్ ను విచారించిన పోలీసులకు పలు విషయాలు వెలుగు చూశాయి. ఆ పిల్లలు తనకు పుట్టలేదనే అనుమానంతోనే  వారిని చంపినట్లు నిందితుడు రవిశంకర్ ఒప్పుకున్నాడు. పిల్లలను చంపేందుకు మూడు నెలలుగా ప్లాన్ చేసినట్లు రవిశంకర్ తెలిపినట్లు సమాచారం. భార్యపై అనుమానంతోనే ఇద్దరు పిల్లలని హత్య చేసినట్టు రవిశంకర్ ఒప్పుకున్నట్టు సమాచారం.  

Also Read :  ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం

Also Read :  బొమ్మ పిస్టల్ తో బెదిరించి దోపిడీ... 500 సీసీ కెమెరాలు శోధించి... తీగలాగితే..

krishna-district | murder | father | childs-death | ap-crime-report | ap-crime-news | ap crime updates | ap crime latest update | ap crime latest updates

Advertisment
Advertisment
తాజా కథనాలు