/rtv/media/media_files/2025/06/21/robbery-gang-2025-06-21-20-40-59.jpg)
Robbery gang
TG Crime : ఒక కిరాణ షాపు యజమానిని పిస్టల్తో బెదరించి డబ్బులు దోచుకున్న సంఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన మహేందర్ ఖాన్ కొంతకాలం క్రితం ఉపాధి కోసం నగరానికి వచ్చి షాపూర్ నగర్ లో స్థిరపడ్డాడు. కిరాణ షాపులకు అవసరమైన మెటీరయల్ సప్లై చేస్తూ జీవన సాగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధి బాగుండటంతో రాజస్థాన్కు చెందని తన స్నేహితులు రాస్తాం ఖాన్, రాహుల్ కాన్ ను కూడా నగరానికి రప్పించాడు. వీరు ముగ్గురు కలసి పనులు చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో వీరికి షాపూర్ నగర్ లో ఉండే దీపక్ అశోక్ పవర్ తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
అయితే తాము చేస్తున్న పనుల వల్ల పెద్దగా ఆదాయం సంపాదించలేమని గుర్తించిన వీరు చోరీలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కిరాణా షాపులలో ఏఏ ప్రాంతాలలో ఏ సమయాల్లో డబ్బును తీసుకువెళ్లూ ఉంటారనే విషయాలపై కొంతకాలం నిఘా పెట్టారు. ఇదే క్రమంలో తాను కొంపల్లి లో ఉన్న శ్రీ లక్ష్మీ కిరాణా అండ్ జనరల్ స్టోర్ కి సామాను సప్లై చేస్తున్న క్రమంలో అక్కడి ఓనర్ రాత్రి సమయంలో షాపు మూసిన తర్వాత డబ్బులను తీసుకువెళ్తున్నట్లు మహేందర్ ఖాన్ గుర్తించాడు. అదే అదనుగా భావించిన వారు ఈ నెల 11న రాత్రి 10:30 సమయంలో ద్విచక్ర వాహనాలపై షాపు వద్దకు వచ్చారు. అనంతరం కిరాణా షాపును మూసివేస్తున్న ఆఖరి నిమిషంలో వచ్చి యజమానికి బొమ్మ పిస్టల్ (లైటర్) ను చూపించి నగదు ఉన్న సంచిని లాక్కొని పారిపోయారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
కిరాణా షాపు యజమానికి పిస్టల్ చూపించి డబ్బులు దోచుకున్నారన్న వార్త దావానంలా వ్యాపించడంతో పాటు తీవ్ర కలకలం రేపింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు ఘటనపై కూపీ లాగారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న 500కు పైగా సీసీ కెమెరాలును జల్లెడ పట్టారు. నిందితులు చోరీ సమయంలో హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు, ఫేస్ మాస్క్ లను కూడా ధరించడంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులకు ఒక కిరాణా షాపు సీసీ కెమెరాల్లో వీరి ముఖాలు రికార్డు కావాడాన్ని గుర్తించారు. ఆ క్లూను బట్టి పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 71 వేల 150 రూపాయలతో పాటుగా ఒక బొమ్మ పిస్టల్, 4 సెల్ ఫోన్స్ 4 సెల్ ఫోన్స్, రెండు యాక్టివా బైక్స్ లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
అయితే వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, ఇదే తొలిసారి చోరీ చేయడమని పోలీసులు తెలిపారు. కాగా షాపు యజమాని వద్ద సుమారు రూ.లక్షలు కాజేసిన వీరు ఆ డబ్బులు నుంచి సెల్ ఫోన్ తో పాటుగా మరికొన్ని వస్తువులను కొనుగోలు చేశారన్నారు. వాటి వివరాలు సేకరించి రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పెట్ బషీరాబాద్ ఏసీపీ బాల గంగిరెడ్డి తెలిపారు.
Also Read : ఏపీలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్యాయత్నం