Andhra Pradesh: ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు!
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం లాటరీ తీయనున్నారు. మొత్తం 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొదలు కానుంది.
ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం లాటరీ తీయనున్నారు. మొత్తం 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొదలు కానుంది.
AP: రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇటీవల వర్షాల కారణంగా ఏపీలోని పలు గ్రామాలు నీటమునిగిన సంగతి తెలిసిందే.
తమ ప్రేమ, సహజీవనం గురించి విమర్శలు చేస్తున్న వారికి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ముగ్గురు భార్యలున్న పవన్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ఆయనది తప్పు కాకపోతే తమది తప్పుకాదన్నారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లవ్ స్టోరీ వెండితెరకెక్కనుంది. వీరిద్దరే హీరోహీరోయిన్గా 'దువ్వాడ జీవిత గాథ' అనే టైటిల్తో తమిళ నిర్మాత తెరకెక్కించనున్నారు. 2025 జనవరిలో ఈ సినిమానుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఏపీలో మరో రాజకీయ హత్య కలకలం రేపింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వన విష్ణుపురంలో వైసీపీ, టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త వీరాస్వామి మృతి చెందాడు. దీంతో పండుగ పూట ఆ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
దువ్వాడ శ్రీనివాస్, మాధురి పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్తలను అతను ఖండించారు. పార్టీ కార్యకర్తలతో తిరుమల బ్రహ్మోత్సవాలు చూడటానికి వెళ్లానని దువ్వాడ తెలిపారు. అందరిలాగానే తాను తిరుమలకు వెళ్లారని, దుష్ప్రచారాలను ప్రచారం చేయవద్దని కోరారు.
వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.
ఛత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్తో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోటబొమ్మాళిలోని జీయన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు 43 ఏళ్ల క్రితం మావోయిస్టు దళంలో చేరాడు. పార్టీ సెంట్రల్ మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు ఈరోజు ఉదయం 6 నిమిషాల పాటు మూలవిరాట్ను తాకాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించారు. మార్చి 9, 10, 11, 12.. అక్టోబర్1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి.