దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ తెలిపింది. మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. కాచిగూడ - శ్రీకాకుళం, చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య దాదాపు 6 స్పెషల్ సర్వీసులు నడపనున్నారు.
కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య - జనవరి 11, 12, 15, 16 తేదీల్లో రాకపోకలు జరగనున్నాయి.
అలాగే చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య - జనవరి 8, 9 తేదీల్లో రెండు స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.
Also Read : భారత్లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?
కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య
కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య (07615) ట్రైన్ జనవరి 11, 15 తేదీల్లో నడవనుంది.
కాచిగూడలో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్కు చేరుకుంటుంది.
Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్..అసలేమైందంటే!
శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ మధ్య
అలాగే శ్రీకాకుళం రోడ్ - కాచిగూడ మధ్య జనవరి 12, 16 తేదీల్లో నడవనుంది.
శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 7.35 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. అయితే ఈ రైలులో అన్నీ థర్డ్ ఏసీ కోచ్లే ఉండటం గమనార్హం.
ఈ ట్రైన్ మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది.
Also Read : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!
చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య
చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ మధ్య (07617) ట్రైన్ జనవరి 8న నడవనుంది.
చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకోనుంది.
శ్రీకాకుళం - చర్లపల్లి మధ్య
Also Read : ఆ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
శ్రీకాకుళం - చర్లపల్లి మధ్య (07618) ట్రైన్ జనవరి 9న నడవనుంది.
శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. ఈ రైలులో ఫస్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయి.
ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగనుంది.