/rtv/media/media_files/2025/01/06/ZGLaEw8OCW2xmQLy0rSC.jpg)
Special Trains
South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. దీంతో ఇప్పటికే పండగకు సొంతూళ్లకు వెళ్లిన కొందరు తిరిగి వారి గమ్య స్థానాలకు చేరుకోవడానికి రెడీ అవుతున్నారు. దీంతో రైలు ప్రయాణం చేసేవారికి దక్షిణ మధ్య రైల్వే ఓ తీపి కబురు చెప్పింది.
పండగకు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడిపిన సౌత్ సెంట్రల్ రైల్వే తిరుగు ప్రయాణం చేసేవారి కోసం కూడా 8 ప్రత్యేక రైళ్లును నడపుతున్నట్లు వెల్లడించింది.
ప్రయాణ ఖర్చులు...
జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. దాంతో సామాన్యుడికి ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి. జనవరి 18న కాకినాడ నుంచి చర్లపల్లికి ఒక రైలు, విశాఖపట్నం నుంచి 2 ప్రత్యేక రైళ్లు చర్లపల్లికి మొదలవుతాయని అధికారులు చెప్పారు. అదే విధంగా జనవరి 19న విశాఖపట్నం, నరసాపురం నుంచి మరో 2 రైళ్లు చర్లపల్లి బయలుదేరతాయి.
అదేరోజు చర్లపల్లి నుంచి భువనేశ్వర్కు ఒకటి, విశాఖపట్నానికి ఒకటి చొప్పున 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి జనవరి 20వ తేదీన మరో ప్రత్యేక రైలు ఉందని సీపీఆర్వో సీహెచ్ శ్రీధర్ తెలిపారు.