/rtv/media/media_files/2025/02/15/dLOv6gvkTyZCkY6UcOAr.jpg)
YS Sharmila fire on ex cm ys jagan and present cm chandrababu Photograph: (YS Sharmila fire on ex cm ys jagan and present cm chandrababu)
బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏంటని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని ఆమె వైసీపీని నిలదీశారు. వైఎస్ జగన్కి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి.. బల ప్రదర్శనలు కాదని ఆమె సూచించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి.. అన్ని అనుమతులు ఇస్తున్నారని షర్మిల అన్నారు.
Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పుతిన్కు కౌంటర్ ఇచ్చిన ట్రంప్
Also Read : అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
YS Sharmila About YS Jagan
ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తే ఆంక్షలు కాంగ్రెస్ పార్టికేనా అని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్ చేస్తారు, స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.- YCP పరమర్శల పేరు మీద చేసే బలప్రదర్శల యాత్రలకు ఆంక్షలు ఉండవా సీఎం చంద్రబాబుని అని అడిగారు. జగన్ మోడీ దత్త పుత్రుడు అని ఆంక్షలు పెట్టడం లేదా అని ఆమె అన్నారు.-- జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని- పోలీసులను సైతం కొనగలడా అని మండిపడ్డారు. జగన్ పరామర్శలో ఇద్దరు చనిపోతే.. దానికి బాధ్యులు ఎవరని ఆమె నిలదీశారు. 100 మందికి అనుమతి ఇస్తే వేల మంది ఎలా వచ్చారని ఆమె మీడియతో చెప్పారు. పోలీసు శాఖ- ప్రేక్షక పాత్ర పోషించిందని ఆరోపించారు.
Also Read : ఈ ఫార్ములా కేసులో ACBకి కేటీఆర్ లేఖ
Also Read : మర్మాంగాలు కోసి.. కారుతో ఈడ్చుకెళ్లి.. వణుకుపుట్టిస్తున్న ఒంగోలు హత్య!
ap-chief-sharmila | cm-jagan-vs-sharmila | ys-sharmila | andhra-pradesh-news | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-politics | bjp | andhra pradesh bjp politics