/rtv/media/media_files/2025/03/14/ZL0cQCIX4DkPHFbH9dTY.jpg)
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. బుధవారం జగన్ పర్యటనలో కంటెపుడి దగ్గర అంబటి రోడ్డుపై ఉన్న బారికేడ్స్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై 188,332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి బారికేడ్స్ తొలగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
Also Read: భారీ వరదలు.. 48గంటల్లోనే 22 మంది మృతి
Police Case On Ambati Rambabu
సత్తెనపల్లిలో మాజీమంత్రి అంబటిరాంబాబు గారి పై కేసు నమోదు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దురుసుగా ప్రవర్తించారని అంబటి రాంబాబు గారి పై కేసు నమోదు చేసిన పోలీసులు. pic.twitter.com/24F9Z7xIZn
— Surya YSRCP (@Surya___YSRCP) June 19, 2025
Also Read: యుద్ధాన్ని నేనే ఆపా.. ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇదిలాఉండగా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర్ విగ్రహావిష్కరణకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. ఆయన ర్యాలీ గుంటూరు, నల్లపాడు మీదుగా పల్నాడు జిల్లా దాకా సాగింది. అయితే గుంటూరు, పల్నాడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కొర్రపాడు శివారులో ఓ పెట్రోల్ బంకు వద్ద పోలీసులు చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జగన్ కాన్వయ్తో పాటు మరికొన్ని వాహనాలు ముందుకెళ్లాయి. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు వెనక ఉన్న వాహనాలు ఆపారు.
Also Read: అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
ఆ సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి వచ్చి వాహనాలు ఎందుకు ఆపారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ఉన్న బారికేడ్లు తొలగించేందుకు యత్నించారు. మరోవైపు ఏటుకూరు ప్రాంతంలో జగన్ కాన్వయ్లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు.
Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పుతిన్కు కౌంటర్ ఇచ్చిన ట్రంప్
telugu-news | rtv-news | ambati-rambabu | andhra-politics | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news