Gujarat Floods: భారీ వరదలు.. 48గంటల్లోనే 22 మంది మృతి

గుజరాత్‌ సౌరాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. బోటాడ్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు. పలు జిల్లాల్లో 48 గంటల్లో వరదల కారణంగా 22 చనిపోయారు.

New Update
Gujarat floods

గుజరాత్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. బోటాడ్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. ఇద్దరు ప్రయాణికులను రక్షించారు. అయితే  ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు వరదలు ఏరులై పారాయి. ఈ వరదల్లో చిక్కుకొని 18 మంది మరణించారు. సౌరాష్ట్ర, సమీప ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు సంభవించాయి. బలమైన ప్రవాహాల ధాటికి నివాసితులు కొట్టుకుపోతున్నట్లు భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

Also Read :  అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. మళ్లీ వీసాలు షురూ

Gujarat Floods 2025

Also Read :  లక్ అంటే ఇదే.. నక్కతోక తొక్కిన ఫ్యామిలీకి దొరికిన రూ.10లక్షల వజ్రం

Also Read :  'కుబేరా' నుంచి ధనుష్ ఎమోషనల్ ట్యూన్.. వింటే కన్నీళ్లు ఆగవు!

దీంతో రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రాణాలను కాపాడటం, ఆస్తులను రక్షించడం, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాఠశాలలను మూసివేశారు. వడోదరలోని ఎన్‌డిఆర్‌ఎఫ్ 6వ బెటాలియన్ జునాగఢ్, ద్వారక, పోర్‌బందర్, అమ్రేలి, రాజ్‌కోట్, భావ్‌నగర్, కచ్, వల్సాద్, గాంధీనగర్, సూరత్ & పటాన్‌లతో సహా వివిధ జిల్లాల్లో 12 బృందాలను సహాయక చర్యల కోసం మోహరించినట్లు తెలిపారు.

Also Read :  ఇరాన్‌కు అండగా ఏకమైన 21 ఇస్లామిక్‌ దేశాలు

 

floods | gujarath | latest-telugu-news | gujarat-floods

Advertisment
Advertisment
తాజా కథనాలు