/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
RCB VS PBKS: సొంత గ్రౌండ్ లో రెండోసారి ఓటమి..5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచిన పంజాబ్
అసలు మ్యాచ్ అవుతుందా లేదా అనుకున్నారు. చివరకు లేట్ గా స్టార్ట్ అయి 14 ఓవర్లతో మ్యాచ్ ను నిర్వహించారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 95 పరుగులు చేయగా...పంజాబ్ దానిని కేవలం 12 ఓవర్లలోనే ఛేదించింది.
ఆర్సీబీని బ్యాడ్ లక్ వీడటం లేదు. దానికి తోడు బెంగళూరు ప్లేయర్ల చెత్త ఆటతో వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్నారు. ఈరోజు తమ సొంత గ్రౌండ్ లోనే ఓడిపోయింది ఆర్సీబీ. బంళూు చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడిన ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 14 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 12.1 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. సొంతగడ్డపై బెంగళూరు జట్టు చతికిలపడం ఇది రెండోసారి. ఆ జట్టులో నేహల్ వధేరా (33*) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు.
Also Read : వివాహేతర సంబంధం నేరం కాదు..ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
Also Read : అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!
చెత్త బ్యాటింగ్...
ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ తో సహా అందరూ చేతులెత్తేశారు. వికెట్లను టపటపా పోగొట్టుకున్నారు. టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయింది. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తోంది. దీన్ని పంజాబ్ బౌలర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. 14 ఓవర్లలోనే మొత్తం అన్ని వికెట్లు తీయలిగారంటే...పిచ్ బౌలింగ్ కు ఎంత అనుకూలిస్తుందో ఊహించవచ్చు. దానికి తోడు ఆర్సీబీ బ్యాటర్లు అసలు ఏ మాత్రం ఎఫర్ట్ పెట్టలేదు. దాంతో కనీసం వంద పరుగులు కూడ దాట లేకపోయారు. మొత్తం టీమ్ లో టిమ్ డేవిడ్ ఒక్కడ 30 పరుగులతో హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. అతని తర్వాత కెప్టెన్ రుతురాజ్ 23 పరుగులు చేశాడు. 14 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ పంజాబ్ కు 96 పరుగులు లక్ష్యాన్నిచ్చింది.
Also Read : ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి..బంగ్లాకు కౌంటర్ ఇచ్చిన భారత్
Also Read : మే 2న కేదార్నాథ్ ,4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
Live Breakings
-
Apr 19, 2025 13:19 IST
మరోసారి అజిత్ కారుకు ప్రమాదం.. ట్రాక్ పక్కకు దూసుకెళ్లిన వాహనం
-
Apr 19, 2025 13:18 IST
ఆ 2వేల మందికి కూడా నోటీసులు ఇస్తారా.. స్మితా సభర్వాల్ సంచలన కామెంట్స్
-
Apr 19, 2025 10:10 IST
వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. హైదరాబాద్కు వచ్చిన అమాయక యువతులతో..!
-
Apr 19, 2025 10:09 IST
Monkeys Attack వేడినీళ్లతో బాత్రూమ్కు వెళ్తుండగా కోతుల బీభత్సం.. వృద్ధురాలు మృతి
-
Apr 19, 2025 09:28 IST
అత్యాచారం చేశాడని..నగ్నంగా మార్చి, ఎడ్లబండికి కట్టి..
అత్యాచారం చేసిన యువకుడికి గ్రామస్తులే బుద్ధి చెప్పారు. అతడిని నగ్నంగా మార్చి...ఎడ్ల బండికి కట్టేశారు. దాని తరువాత అతనిని పిచ్చ కొట్టుడు కొట్టారు. ఆ తరువాత దీనికి సంబంధించిన వీడియోను గ్రామస్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
-
Apr 19, 2025 08:30 IST
తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు.. నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
ఈ నెల 29 నుంచి మే 4 వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.
-
Apr 19, 2025 08:01 IST
కుప్పకూలిపోయిన భవనం.. నలుగురు మృతి
-
Apr 19, 2025 08:01 IST
వివాహేతర సంబంధం నేరం కాదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
-
Apr 19, 2025 08:00 IST
మే 2న కేదార్నాథ్ ,4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!
చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ తలుపులు మే 2న అధికారికంగా తిరిగి తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి) ప్రతినిధి తెలిపారు. అలాగే మే 04వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు.
-
Apr 19, 2025 07:59 IST
మే 1 నుంచి శాటిలైట్ టోల్..కేంద్రం క్లారిటీ
-
Apr 19, 2025 07:59 IST
నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!