/rtv/media/media_files/2024/11/04/0PlUEDu2HdCekEZM1bbx.jpg)
ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. మార్చి 17వ తేదీ నుంచి ఏపీలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకూ పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించనున్నారు.
Also Read: Summer:ఎండలు ముదురుతున్నాయి..జాగ్రత్త!
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం.. సిబ్బందికి పలు సూచనలు కూడా చేసింది.ఆంధ్రప్రదేశ్లో మొత్తం 649884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 3450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
హాల్టికెట్ చూసి...
ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల సౌలభ్యం కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. పదో తరగతి విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా కూడా హాల్టికెట్ చూసి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ఎక్కించుకోవాలని సిబ్బందిని ఆదేశించింది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కేవలం పరీక్షలు ఉన్న రోజుల్లో మాత్రమే అని అధికారులు తెలిపారు.
సెలవు రోజుల్లోనూ పరీక్షలు ఉంటే విద్యార్థులను బస్సుల్లోకి ఉచితంగా అనుమతించాలని పేర్కొంది. జిల్లా విద్యా శాఖ అధికారులు కూడా విద్యార్థుల సౌలభ్యం కోసం తగినన్ని బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు చేసుకోవాలని సూచించింది.
మరోవైపు పదో తరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ ద్వారా హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించింది. మరోవైపు పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి నారా లోకేష్ ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాజాగా పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకోవటంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!
Also Read: BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?