AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ప్రభుత్వం నుంచి మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారని మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో కొనియాడారు. 

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

AP CM Chandrababu praises on womens

AP News: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారని మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో కొనియాడారు. 

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి..

ఈ మేరకు మార్చి8న మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో శుక్రవారం ‘న్యూ జెనరేషన్-టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ - ప్రోస్పెరిటీ ఫర్ ఆల్’ అనే అంశంపై సదస్సు నిర్వహిచారు. నోవోటెల్ హోటల్ జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో మహిళా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, సాంకేతికత వినియోగం, నూతన ఆవిష్కరణల ద్వారా ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని అన్నారు.  మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పారు. 

పురుషులకంటే మహిళలే మెరుగు..

అంతేకాదు ప్రస్తుత రోజుల్లో పురుషులకంటే మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారని కొనియాడారు. అన్ని రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. శ్రామిక శక్తిలో మహిళలు లేకుండా పురోగతి అసాధ్యం. ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. నా చిన్నతనంలో నా తల్లి వంటగదిలో పడ్డ ఇబ్బందులు నేను చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ మహిళా పడకూడదనే ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకొచ్చాం. నా తల్లి కష్టం ఈ పథకాన్ని తీసుకురావడానికి ప్రేరణగా నిలిచిందన్నారు. ప్రస్తుతం దీపం 2 కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలపై భారాన్ని మరింత తగ్గించాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను దాదాపు 45 శాతం మహిళలే నడిపిస్తున్నారని చెప్పారు. బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడంతో మహిళలకు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తారన్నారు.  అందుకోసం అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 


ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

ఇక రాష్ట్రంలో వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఏ మహిళకైనా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్మాణాత్మకమైన మద్దతును అందిస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలను ప్రోత్సహించి అద్భుతాలను సృష్టిస్తామన్నారు. ప్రతి మహిళ AIలోనూ రాణించాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2.4 ట్రిలియన్ డ్రాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఆవిష్కరించాలనే లక్ష్యంతో విజన్‌ను రూపొందించామన్నారు. ఏపీని ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ గా నిలిపి 15 శాతం వృద్ధి రేటు సాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist : మావోయిస్టుల కుట్ర భగ్నం....జర్రయితే ప్రాణం పోతుండే.

ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు అమర్చిన 10 మందుపాతరలను నిర్విర్వం చేశాయి.

New Update
Maoist Key Leader Hidma Arrested

Maoist

Maoist : ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అందులో భాగంగా తమ కోసం వచ్చే భద్రతాదళాలను మట్టుపెట్టడానికి బాంబులు పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అడవి ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 10 మందుపాతరలను అమర్చారు. అయితే వాటిని గుర్తించిన  భద్రతా బలగాలు నిర్వీర్యం చేసి.. స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఉదయం కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంప్ కుతుల్ గ్రామం ఖోడ్పర్, గుర్మ్కా అటవీ రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ క్రమంలో మందుపాతరలను గుర్తించినట్లు భద్రతాబలగాలు తెలిపాయి. కాగా ఈ ప్రాంతంలో ఐఈడీలను అమర్చడంతో దరిదాపుల్లోనే మావోయిస్టులు ఉండిఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా బీడీఎస్‌ బృందాలతో కలిసి ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి.

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రధానమంత్రి మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. మావోయిస్టులే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో ఇప్పటికే వివిధ ఎన్‌కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించారు. అలాగే వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

ఇక కేంద్రం ఇటీవల విడుదల చేసిన సమాచారాన్ని బట్టి  గతంలో కంటే మావోయిస్టుల హింస పూర్తిగా తగ్గిపోయింది. 2010లో మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు 1936 ఉంటే అవి 2024 నాటికి 374కు తగ్గిపోయాయని తెలిపింది. అంటే దాదాపు 81 శాతం మేర మావోయిస్టుల హింస తగ్గిందని వివరించింది. అలాగే దేశంలో 2013లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు 126గా ఉంటే.. అవి 2021 నాటికి 70.. ఇక ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నాటికి అవి 18కి పరిమితమైనట్లు వెల్లడించింది. మావోయిస్టుల హింసలో 2010 నాటికి 720 మంది పౌరులు మరణిస్తే.. 2019కి ఆ సంఖ 150కి చేరుకుంది అది ప్రస్తుత ఏడాది మాత్రం 19 మంది మరణించారని తెలిపింది. మావోయిస్టు అగ్రనాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో మావోయిస్టు కార్యకలపాలు దాదాపు తగ్గుముఖం పట్టినట్లు కేంద్రం వెల్లడించింది.

 Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

 

Advertisment
Advertisment