/rtv/media/media_files/2024/11/20/8TL1QnVDd0qt87vvOIBi.jpg)
BIG BREAKING: మద్యం ప్రియులకు బిగ్ షాక్. లిక్కర్ ధరలు మరింత భారం కానున్నాయి. ఇటీవలె మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ప్రకటించారు. మొన్ననే పెంచారు..ఇప్పుడు మళ్లీనా..ఇలా బీర్లు, లిక్కర్ ధరలు పెంచుతూ పోతే ఎలా అని బాధపడుతున్నారా? అయితే ఇది మన రాష్ర్టంలో కాదు. కర్ణాటకలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించడంతో మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధరలు పెరిగినకొద్దీ అమ్మకాలు తగ్గుతాయేమోనని వైన్స్ షాపు యజమానులు కూడా బయపడుతున్నారు.
Also Read: TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే ఒకసారి షాక్ ఇచ్చన కర్ణాటక ప్రభుత్వం మద్యం ప్రియులకు మరోసారి షాకిచ్చింది. మద్యం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. 650 ఎంఎల్ బాటిల్ బీరు ధర ప్రీమియంలను బట్టి 10నుంచి 45 రూపాయల వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈరోజు కర్ణాటక అసెంబ్లీలో2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం సిద్ధరామయ్య మరోసారి మద్యం ధరలను సమీక్షించనున్నట్లు తెలిపి షాకిచ్చారు. 2024లో కర్ణాటకలో మద్యం అమ్మకాలు రూ.36వేల 500 కోట్లుగా ఉంది.. ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని 40వేల కోట్లకు లక్ష్యంగా పెట్టుకుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ ఏడాది జనవరి 20న బీరు సుంకాలు పెంచడంతో బీరు ప్రియులు ఇప్పటికే ధరల పెరుగుదల భారాన్ని ఎదుర్కొంటున్నారు.
Also Read: Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదల!
ఈ ఏడాది ప్రారంభంలో మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ ఎక్సైజ్ శాఖలో ఆదాయ లోటును పూడ్చడానికి ఈ పెంపు అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో బిల్లింగ్ ధరపై ఎక్సైజ్ డ్యూటీ 185శాతం నుంచి 195 శాతానికి పెంచనున్నారు. లేదా లీటర్ కు 130 రూపాయలు పెంచనున్నారు. దీని ప్రకారం.. ఇప్పుడు 100రూపాయలున్న బీరు బాటిల్ ధర రూ. 145లకు చేరనుంది. 230రూపాయలున్న బీరు బాటిల్ ధర రూ. 245కు పెరగనుంది. అయితే మద్యం ధరల పెరుగుదలపై అటు వైన్స్ షాపుల ఓనర్లు, ఇటు మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. రేట్లు పెంచితే బీరు అమ్మకాలు కనీసం 10శాతం తగ్గవచ్చని మద్యం విక్రేతలు భయపడుతున్నారు. గత వారం రోజులుగా బీర్ల సరఫరా లేదు. ప్రభుత్వం నిర్ణయంతో వ్యాపారం దెబ్బతింటోందని అంటున్నారు.
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!