/rtv/media/media_files/2025/01/18/lDEV4D1KOmnf0SK6Bz8H.jpg)
Nara Lokesh Chandrababu
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబునాయుడు కోరడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు నిర్వహించిన కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభ వేదికపైనే ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. టీడీపీ (TDP) లో లోకేష్ మూడో తరం నేత అని అన్నారు. యువనేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read : వాళ్లకి ఉచిత కరెంట్, నీరు.. కేజ్రీవాల్ సంచలన హామీ
Deputy CM Nara Lokesh
మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో నారా లోకేశ్ను డిప్యూటీ సీఎంగా చేయాలని చంద్రబాబుకు సభా వేదిక నుంచి పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
— M9 NEWS (@M9News_) January 18, 2025
The cameraman is an idiot not to show CBN's Expressions when Srinivas Reddy asked this.#NaraLokesh pic.twitter.com/B7ocz9tWvY
Also Read : మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్కతా కోర్టు సంచలన తీర్పు!
ఇటీవల ఇదే అభిప్రాయాన్ని మహాసేన రాజేష్ సైతం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ (Nara Lokesh) ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు ఈ డిమాండ్ ను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబు ముందే ఆ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం సంచనంగా మారింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ కానట్లు తెలుస్తోంది.
Also Read : స్పామ్ కాల్స్కు చెక్..సంచార్ సాథీ మొబైల్ యాప్
Also Read : మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!