/rtv/media/media_files/2025/01/18/NZ3UL5tKdVkn54wfaeop.jpg)
blinken
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అధికార బాధ్యతల నుంచి వైదొలగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్,హమాస్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కు తన చివరి ప్రెస్ మీట్ లో చేదు అనుభవం ఎదురైంది.
ఈ సమావేశంలో గాజా యుద్ధాన్ని కవర్ చేసిన ఇద్దరు జర్నలిస్టులు బ్లింకెన్ పై తీవ్ర విమర్శలు చేశారు.గాజాలో 15 నెలల యుద్ధం నేపథ్యంలో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను బ్లింకెన్ సమర్థించడాన్ని ఓ పాత్రికేయుడు సామ్ హుస్సేన్ ప్రశ్నించారు.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నుంచి అంతర్జాతీయ నేర న్యాయస్థానం వరకు ఇజ్రాయెల్ నరమేధం జరుపుతోందని ,నాశనం చేస్తోందని చెప్పాయి. కానీ,మీరు ఆ ప్రక్రియను గౌరవించమని చెబుతున్నారు? అంటూ హుస్సేన్ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
అనంతరం భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో హుస్సేన్, బ్లింకెన్ పై తీవ్ర విమర్శలు చేశారు.అదే సమయంలో గ్రేజోన్ వార్తా సంపాదకుడు మాక్స్ బ్లూ మెంథల్ సైతం బ్లింకెన్ పై విమర్శలు గుప్పించారు.
ఖతార్ మధ్యవర్తిత్వంతో..
ఇదిలా ఉండగా..ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య కాల్పుల విరమణ , బందీల విడుదల పై ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.అమెరికా , ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పంద ప్రక్రియ కొనసాగుతోంది.
దీని ప్రకారం..బందీల విడుదలకు ప్రతిగా పాలస్తీనీ ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
Also Read: Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు!
Also Read: Maha Kumbh Mela: నాగ సాధువులు రోజులో ఎంత తింటారు..ఎక్కడ ఉంటారు అంటే!