ఢిల్లీలో మంచు ఎఫెక్ట్.. రైళ్లు, విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బీభత్సంగా పొగమంచు ఉండటం వల్ల వాహనాలు కనిపించడంలేదు. దీంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడి విశాఖ తీర సమీపానికి చేరింది. దీంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుంది. దీనివల్ల తమిళనాడు, ఏపీ, యానాంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. దీని వలన ఉత్తరాంధ్రలో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల నమోదవుతున్నాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలు చేశారు. తిరుమలలోని ఘాట్ రోడ్లలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.