Rain Alert To Telugu States | రేపటి నుంచి వానలే వానలు | IMD Report | Monsoon Rains | AP & Telangana
నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బెంగళూరు నగరంలో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, వంటి ప్రాంతాలు నీట మునిగాయి.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు.
తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖా తెలిపింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో రాబోయే 24 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీనికరణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ఏర్పడవచ్చు. రోడ్డు, రైలు ట్రాఫిక్లో సమస్యలు తలెత్తవచ్చు.
శీతాకాలంలో చలి పంజా విసురుతుంది. పెరుగుతున్న చలి కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించింది. లక్నో, బరేలీ, షాజహాన్పూర్ జిల్లాల్లో స్కూళ్లకు జనవరి 16 వరకు సెలవు పొడిగించారు. కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నాయి.