Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వానలే వానలు

పశ్చిమ బెంగాల్‌ సమీపంలో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

New Update
hyd-rains

Weather Update

రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌ సమీపంలో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని, ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

ఏపీలో ఈ జిల్లాల్లో..

నేడు ఏపీ(Andhra Pradesh)లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

ఇది కూడా చూడండి: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద

తెలంగాణలో ఈ జిల్లాల్లో..
తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

ఇది కూడా చూడండి: Bihar : క్షుద్రపూజల చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలో అయిదుగురి హత్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు