Taxi: క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌.. ఓలా, ఉబర్‌కు పోటీగా భారత్‌ ట్యాక్సీ.. కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్‌ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్‌ డివిజన్ దీన్ని అభివృద్ధి చేసింది.

New Update
Bharat Taxi, India's First Cooperative Cab Service To Challenge Ola, Uber

Bharat Taxi, India's First Cooperative Cab Service To Challenge Ola, Uber

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్‌ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్‌ డివిజన్ దీన్ని అభివృద్ధి చేసింది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ఈ సేవలు పైలట్‌ ప్రాతిపదికన ప్రారంభించనున్నారు. ముందుగా 650 మంది సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లు ఈ సేవలు అందిస్తారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఈ ఏడాది డిసెంబర్‌లోనే దేశవ్యాప్తంగా భారత్‌ ట్యాక్సీని అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Also Read: కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి...  ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం

 ఈ భారత్ ట్యాక్సీ గురించి గతంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రస్తావించారు. సహకార సంఘాల మాదిరిగానే ఇది పనిచేస్తుంది. ఇందులో టూవీలర్, ఆటోలు, ఫోర్‌ వీలర్లు సేవలు అందిస్తాయి. దీనిపై వచ్చే లాభాలను ఏ కంపెనీ కూడా తీసుకోదు. కేవలం డ్రైవర్లకు మాత్రమే లబ్ధి జరుగుతందని అమిత్ షా గతంలోనే చెప్పారు. ఇదిలాఉండగా ఉబర్, ఒలా, రాపిడో లాంటి కంపెనీలు తమ ఆదాయం నుంచి 25 శాతం కమీషన్లు తీసుకోవడంపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం భారత్‌ ట్యాక్సీని తీసుకొస్తోంది. ఇందులో రిజిస్టర్ అయిన ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన పని ఉండదు. కేవలం మెంబర్‌షిప్ కింద కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: కయ్యానికి కాలు దువ్వతున్న చైనా.. సరిహద్దులో ఎయిర్ బేస్ నిర్మాణం

ఇక ఈ భారత్ ట్యాక్సీ సేవలు వచ్చే ఏడాది మార్చి నాటికి మెట్రో నగరాల్లో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకుంది. 2030 నాటికి లక్షమంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం చేయాలని భావిస్తోంది. 'సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' కింద ఈ ట్యాక్సీ సేవలు అందనున్నాయి. 

Advertisment
తాజా కథనాలు