AP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, కడప జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్‌లో వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది.

New Update
Rains

Rains

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, కడప, అనంతపూర్ వంటి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, తాండూరు, మెదక్, నారాయణఖేడ్, వికారాబాద్, మేడ్చల్, బాల్కొండ, జగిత్యాలలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి

మే 27వ తేదీ నుంచి..

ఇదిలా ఉండగా  మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా వర్షాలు కురవడం మొదలవుతాయి. జులై 8 నాటికి ఈ రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. మళ్లీ నార్త్‌వెస్ట్‌ భారత్ నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది.

ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

అక్టోబర్ 15 నాటికి ఇది ముగుస్తుంది. అయితే ఈసారి జూన్ 1 కంటే ముందుగానే మే 27న నైరుతి రుతుపనవాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 2024లో మే 30న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2023లో జూన్ 8న, 2022లో మే 29న ప్రవేశించాయి. మరోవైపు ఈసారి వర్షకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యో ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ చెప్పింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?

ఇదిలా ఉండగా భారత్‌లో 52 శాతం నికర సాగు భూమికి వర్షపు నీరే ప్రధాన ఆధారం. దేశం మొత్తంగా చూసుకుంటే ఈ సాగు భూమి నుంచే 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకోసమే నైరుతి రుతుపవనాలు అనేవి ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు