తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.

New Update
Rains

Rains

ఏపీ, తెలంగాణలో నేడు, రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ఏపీలో తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి:  AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

మే 27వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు..

ఇదిలా ఉండగా  మే 27నే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా వర్షాలు కురవడం మొదలవుతాయి. జులై 8 నాటికి ఈ రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. మళ్లీ నార్త్‌వెస్ట్‌ భారత్ నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO

అక్టోబర్ 15 నాటికి ఇది ముగుస్తుంది. అయితే ఈసారి జూన్ 1 కంటే ముందుగానే మే 27న నైరుతి రుతుపనవాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 2024లో మే 30న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2023లో జూన్ 8న, 2022లో మే 29న ప్రవేశించాయి. మరోవైపు ఈసారి వర్షకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యో ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ చెప్పింది. 

ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

 

Advertisment
Advertisment
తాజా కథనాలు