/rtv/media/media_files/2025/04/18/5GIa6H9ferlXN00vuuDn.jpg)
AP and Telangana Heavy rains two days
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మొత్తం 12 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి త్వరగానే వస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకినట్లు చెప్పింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. రేపు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
Also Read : Pakistan: భారత్తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్ కుట్ర !
AP And Telangana Heavy Rains
ఏపీలో అల్లురి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక తెలంగాణలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
గురువారం రాత్రినుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. సాయంత్రం మబ్బులు కమ్ముకుని చల్లబడిన వాతావరణం శుక్రవారం ఉదయం వర్షంతో మరింత చల్లబడింది. ఉదయం నుంచే చిన్నగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది. రామంతాపూర్, ఉప్పల్, తార్నాక, జాబ్లీహిల్స్, బంజారాహిల్స్, అత్తాపూర్, మెహిదీపట్నం, ఫలక్నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో మిగతా ప్రాంతాల్లోనూ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది.
Also Read : ఆ స్టేడియంలో మళ్లీ ఆడాలనుంది.. రోహిత్ శర్మ ఎమోషనల్!
rains | telangana | andrapradesh | telugu-news | today telugu news