పహల్గామ్ టెర్రర్ అటాక్‌.. మరో భయంకరమైన వీడియో (VIDEO VIRAL)

పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో ఓ టూరిస్ట్ జిప్‌లైన్‌పై వెళ్తుండా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన స్పాట్‌‌ ఏరియా మొత్తం కవర్ అయ్యింది. ఉగ్రవాదుల కాల్పులకు పర్యాటకులు భయంతో పరుగుతు తీశారు.

New Update
terror attack goes viral

జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌కు సంబంధించి వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదుల కాల్పులు జరుపుతున్నప్పుడు అక్కడ పర్యటకులు భయాందోళనకు గురై పరుగులు పెడుతున్నారు. ఓ టూరిస్ట్ జిప్‌లైన్‌లో వెళ్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలు తుపాకుల శబ్ధం, టూరిస్టులు పరిగెడుతున్న విజువల్స్ అందులో ఉన్నాయి. అదే ఏరియాలో తీవ్రవాదులు 28 మంది పర్యటకులను కాల్చి చంపారు. ఉగ్రవాదుల భయానికి ఓ యువకుడు పరిగెడుతూ కింద పడిపోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది.

Also read: BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!

ఆ వీడియో తీసిన వ్యక్తి పేరు రిషి భట్. దాదాపు 16, 18 మందిని హత్య చేయడం జిప్‌లైన్‌ పై నుంచి వెళ్తూ ఆయన చూశానని మీడియాకు తెలిపాడు. జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని అరిచి, ఆ తర్వాత వెంటనే కాల్పులు జరపడం ప్రారంభించాడని చెప్పాడు. అతని జిప్‌లైన్ స్టార్ట్ అయిన 15 సెకన్ల తర్వాత కాల్పులు జరిగాయని చెప్పుకొచ్చాడు. అప్పటికే అతని భార్య, పిల్లాడు కింద నుంచి కేకలు వేస్తున్నారని రిషి భట్ అన్నాడు. ఈ విశాలమైన ప్రదేశంలో ఉన్న పర్యటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయని ఆ భయంకరమై దృష్యాలను ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి.

Also read: BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!

( viral-video | attack in Pahalgam | Pahalgam attack | video | jammu-kashmir | jammu kashmir attack | india)

Advertisment
Advertisment