/rtv/media/media_files/2025/04/28/XlpknLWxY24VRP5iSgwS.jpg)
జమ్ము కశ్మీర్ అనంత్నాగ్లో జరిగిన టెర్రర్ అటాక్కు సంబంధించి వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదుల కాల్పులు జరుపుతున్నప్పుడు అక్కడ పర్యటకులు భయాందోళనకు గురై పరుగులు పెడుతున్నారు. ఓ టూరిస్ట్ జిప్లైన్లో వెళ్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలు తుపాకుల శబ్ధం, టూరిస్టులు పరిగెడుతున్న విజువల్స్ అందులో ఉన్నాయి. అదే ఏరియాలో తీవ్రవాదులు 28 మంది పర్యటకులను కాల్చి చంపారు. ఉగ్రవాదుల భయానికి ఓ యువకుడు పరిగెడుతూ కింద పడిపోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది.
Also read: BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
Another horrific footage of #PahalgamTerroristAttack.
— Mr Sinha (@MrSinha_) April 28, 2025
A man from Ahmedabad had recorded it unknowingly... He wasn't even aware of what was happening on the ground...😐 pic.twitter.com/itwPMxvJnf
ఆ వీడియో తీసిన వ్యక్తి పేరు రిషి భట్. దాదాపు 16, 18 మందిని హత్య చేయడం జిప్లైన్ పై నుంచి వెళ్తూ ఆయన చూశానని మీడియాకు తెలిపాడు. జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని అరిచి, ఆ తర్వాత వెంటనే కాల్పులు జరపడం ప్రారంభించాడని చెప్పాడు. అతని జిప్లైన్ స్టార్ట్ అయిన 15 సెకన్ల తర్వాత కాల్పులు జరిగాయని చెప్పుకొచ్చాడు. అప్పటికే అతని భార్య, పిల్లాడు కింద నుంచి కేకలు వేస్తున్నారని రిషి భట్ అన్నాడు. ఈ విశాలమైన ప్రదేశంలో ఉన్న పర్యటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయని ఆ భయంకరమై దృష్యాలను ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి.
Also read: BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
( viral-video | attack in Pahalgam | Pahalgam attack | video | jammu-kashmir | jammu kashmir attack | india)