Kishan Reddy: అది డాడి డాటర్, అన్నాచెల్లెళ్ల సమస్య: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కవిత ఇష్యూ డాడీడాటర్, అన్నాచెల్లెళ్ల సమస్యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జైలుకు వెళ్లిన కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అది పార్టీ లేదా ఫ్యామిలి అంతర్గత విషయమన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

New Update
Union Minister Kishan Reddy: రైతులను నిండా ముంచిన కేసీఆర్.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..

పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్మీ సామర్ధ్యాన్ని తక్కువ చేసి మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి.. ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. అది డాడీ, డాటర్.. అన్నా చెల్లెళ్ల సమస్య అని కవిత ఇష్యూపై స్పందించారు. అది పనిరాని మ్యాటర్ అని కేంద్ర మంత్రి అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. కవిత విషయం పార్టీ లేదా ఫ్యామిలి అంతర్గత వ్యవహారమని అన్నారు. అది తెలంగాణ ప్రజల సమస్యగా తాము పరిగణించమని కిషన్ రెడ్డి అన్నారు. ఆస్తి, అధికారం కోసం కొట్లాడుతున్న సమస్య కవితదని.. మాకు, ప్రజలకు ఆ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. 

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

Also Read: 2014- 2023 గద్దర్ అవార్డ్స్.. ఉత్తమ చిత్రాలుగా RRR, అఖండ, జెర్సీ, కలర్ ఫొటో

Kishan Reddy Says On Kavitha Issue

భారత సైన్యం సామర్ధ్యాన్ని దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు.  భారత్‌కు చెందిన రఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయని రాహుల్ అడగటం నిజంగా సిగ్గచేటన్నారు. అసలు POKను పాకిస్థాన్‌కి అప్పగించిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. తిరిగి ప్రశ్నించడం బాధాకరమని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్‌కి మొదటి మద్దతు ఇచ్చినా ఆ తర్వాత కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుంది. ఎక్కడ క్రెడిట్ మొత్తం మోదీకి వెళ్తుందో అని ప్రశ్నించడం ప్రారంభించింది. తెలంగాణలో కూడా ఆపరేషన్ సింధూర్ విజయంపై ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ అంతలోనే రాహుల్ లాగే మాట మార్చుతూ BJPపై విమర్శలు చేయడం మొదలుపెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

Also Read :  నువ్వు కాదు ఆ మాట మీ అయ్యతో చెప్పించు.. కవితపై రఘునందన్ సంచలనం!

KCR family politics | MLC Kavitha Issue | union-minister-kishan-reddy | brs | telangana | cm-revanth-reddy | operation Sindoor | latest-telugu-news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు